రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం

0
241

రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం

ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి దిశానిర్దేశంలో మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏపీ రెవెన్యూ శాఖ శ్రీకారం చుట్టింది

చీరాల: చీరాల పట్టణం ఉజిలిపేట నందు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాసుపుస్తకాల్లోని తప్పిదాలను సవరించి, ప్రభుత్వ రాజముద్రతోపాటు క్యూఆర్ కోడ్స్‌తో రూపొందించిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు, భూయజమానులకు అందజేయడం జరిగింది.
 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వే నిర్వహించింది. జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌లతో కూడిన  21.86 లక్షల పాస్ పుస్తకాలను వెబ్ ల్యాండ్‌లోని వివరాలతో సహా ముద్రించడం జరిగింది. 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల పాలిట మరణ శాసనంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌ నుంచి విముక్తి కలగించి, నేడు జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసిన సీఎం చంద్రబాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..

ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రశేఖర్ గారు చీరాల ఎమ్మార్వో , AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, లబ్ధిదారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Punjab
High Stakes: Civic Polls & Public Holiday
The Punjab government has officially declared a public holiday tomorrow, May 26, to facilitate...
By Dunna Jessicaruth 2026-05-25 07:14:51 0 413
Tamilnadu
కొడైకెనాల్‌లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య.. గెస్ట్‌హౌజ్‌లో కుర్చీకి కట్టేసి ఊపిరాడకుండా చేసి..!
కొడైకెనాల్‌‌లో ఓ గెస్ట్ హౌజ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణ హత్యకు...
By Bharat Aawaz 2026-02-23 07:48:34 0 439
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను సన్మానించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టసుఖాల్లో...
By Benguluri Madhubabu 2026-03-29 12:22:14 0 242
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.
మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-23 11:24:40 0 161
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఆర్ డీఎస్పీ.
అన్నమయ్య జిల్లా సాయుధ దళాల (ఏఆర్) డీఎస్పీగా ఏడుకొండల రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు....
By Pagadala Venkateswar 2026-01-26 06:01:25 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com