మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.

0
202

కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పదోన్నతి పత్రాలను ఆయన పంపిణీ చేశారు. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గిద్దలూరు మరియు బెస్తవారిపేట మండలాలకు చెందిన 39 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీల పట్ల అత్యంత సానుకూలంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీలు కోరిన 15 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 13 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన స్పష్టం చేశారు. అంగన్‌వాడీలు పదవీ విరమణ చేసిన అనంతరం ఇచ్చే ఆర్థిక సాయాన్ని 1,20,000 రూపాయలకు పెంచడం, మట్టి ఖర్చుల నిమిత్తం ఇచ్చే మొత్తాన్ని 15,000 రూపాయలు, పదవీ విరమణ కాలాన్ని 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు.. తమ చిరకాల వాంఛ అయిన పదోన్నతిని కల్పించినందుకు, అలాగే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి అంగన్‌వాడీ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
In wins third t20 World Cup
కడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా...
By Naveen Kumar 2026-03-09 04:27:14 0 335
Andhra Pradesh
మదనపల్లె: ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి -MLA.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా, ఆదివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొండమర్రిపల్లి...
By Pagadala Venkateswar 2026-04-06 04:20:53 0 159
SURAKSHA
Vinay Kumar Gadge, IPS: A Visionary Guardian of Justice
A dedicated IPS officer of the AGMUT Cadre, Vinay Kumar Gadge has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-22 07:20:26 0 39
Andhra Pradesh
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
By Gadiyapudi Narendra 2025-12-27 16:11:37 0 417
Andhra Pradesh
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు...
By Boya Dasthagiri 2026-05-06 15:44:27 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com