మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే

0
272

మహారాష్ట్ర కొత్త డీజీపీగా 26/11 హీరో సదానంద్ దాతే

మహారాష్ట్ర: మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్(డీజీపీ)గా 26/11 ఉగ్రదాడుల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన సదానంద్ దాతే నియమితులయ్యారు. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన 59 ఏళ్ల సదానంద్ జనవరి 3న బాధ్యతలు స్వీకరించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అధిపతిగా ఉన్న ఆయన ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీల్లో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది. ఆర్థిక నేరాలపై పరిశోధనలకు గాను ఆయన పుణే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దాతే 26/11 ముంబై ఉగ్రదాడులను ఎదుర్కొన్న హీరోలలో ఒకరిగా నిలిచారు. 2008 నవంబర్ 26న ఉగ్రదాడుల సమయంలో ఆయన ముంబై సెంట్రల్ రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆయన నాయకత్వం లోని ఓ బృందం కామా ఆసుపత్రిపై దాడి చేసిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్లను చుట్టుముట్టింది. గ్రెనేడ్ శకలాల వల్ల దాతే తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఉగ్రవాదులతో పోరాడారు. ఆయన సేవలకుగాను కేంద్రం రాష్ట్రపతి పతకంతో సత్కరించింది. ఆ గ్రెనేడ్ శకలాలూ ఇప్పటికీ ఆయన శరీరంలో, కంటి దగ్గరా ఉన్నాయి. వాటిని గాయాలుగా కాక యుద్ధ క్షేత్రపు పతకాలుగా ఆయన అభివర్ణిస్తారు.

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
The People’s Officer: Mahesh Bhagwat’s Legacy of Justice
Mahesh Bhagwat: A Beacon of Hope and Integrity ​Transforming Policing Through Compassion,...
By Kalaga Sailaja 2026-07-08 09:51:07 0 77
Andhra Pradesh
శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ముక్కోటి మహోత్సవాలు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నెహ్రు నగర్ నందిగామలో స్వామివారి...
By Rajini Kumari 2025-12-30 10:53:01 0 201
Andhra Pradesh
ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా
పత్రికా ప్రకటన! ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే --- ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2025-12-16 07:19:47 0 189
Andhra Pradesh
ద్రాక్షారామంలో కాళేశ్వర స్వామి శివలింగం ద్వమ్సాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం
దాక్షారామం లో కాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో హిందూ...
By Rajini Kumari 2026-01-10 13:14:30 0 186
Andhra Pradesh
నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల...
By Patan Khuddus 2026-06-25 18:38:19 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com