జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు : కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా...(01.01.2026)
- జిల్లా ప్రజలకు, మీడియాకు, పోలీసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ... జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు.
- యువత నూతన సంవత్సర వేడుకలలో అత్యుత్సాహంతో రోడ్డు ప్రమాదాలకు గురికావద్దు .
- అందరూ బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని సూచన.
2026 నూతన సంవత్సరo సందర్భంగా గురువారం రాత్రి కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం _ కొండారెడ్డి బురుజు వద్ద కేక్ కట్ చేసి పోలీసు అధికారులకు, జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలందరూ క్షేమంగా, సురక్షితంగా, సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహ న్, కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్, కర్నూల్ పట్టణ సిఐలు ఉన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz