కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘కార్యకర్తలతో ముఖాముఖి’ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

0
107

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖాముఖి” నిర్వహించారు. వివిధ డివిజన్ల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లోని సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని శ్రద్ధగా విని తక్షణ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తలే పార్టీకి బలం, పార్టీ అభివృద్ధికి మూలస్తంభాలని పేర్కొన్న ఎమ్మెల్యే, వారి సమస్యలు పరిష్కరించడమే తన ప్రధాన బాధ్యత అని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు చేసేందుకు కార్యకర్తల సూచనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

ప్రజలతో పాటు కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసా ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా.|
    హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి...
By Sidhu Maroju 2026-01-15 07:31:41 0 152
Andhra Pradesh
Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!
ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు...
By Pagadala Venkateswar 2026-02-11 07:43:54 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com