12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

0
332

ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2025.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మైలవరం నియోజకవర్గంలోని 1420 మంది లబ్ధిదారులకు రూ.12 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ లను మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన బుధవారం లబ్దిదారులకు అందజేశారు. పేదల ఆరోగ్యానికి అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందన్నారు. భారీగా సీఎంఆర్ఎఫ్ మంజూరు చేసిన సీఎం చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి లబ్దిదారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. 

 

పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేత.

 

నూతన ఏడాదిని పురస్కరించుకుని మైలవరం పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, మిఠాయిలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు బుధవారం అందజేశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. వారంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా డ్రోన్ కు దొరికేస్తాను జాగ్రత్త
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేరగాళ్లపై పోలీసులు నిఘా పెంచారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అదేశాలతో...
By Pagadala Venkateswar 2026-01-15 07:59:33 0 122
Andhra Pradesh
రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల
నేడు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కారసాల శశ్వంత్ వీర్ అవిఘ్న పుట్టిన రోజు సందర్భంగా సంరక్ష కోటయ్య...
By Vadlamudi NagaVenkat 2026-03-10 14:56:35 0 615
Andhra Pradesh
పూనూరు :పుంగనూరు పట్టణ పరిధిలో టెంపో బోల్తా.
పుంగునూరు పట్టణ పరిధిలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం దగ్గర మంగళవారం సాయంత్రం ఒక టెంపో బోల్తా...
By Kothuru Murali 2026-01-28 08:59:32 0 97
Andhra Pradesh
RTG సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపైCM చంద్రబాబు సమీక్ష
*Press Release*   *తరుచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి*   *మూడు రీజియన్లల్లో...
By Rajini Kumari 2025-12-23 07:58:44 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com