ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్ వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు

0
160

*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*

 

 

షాబుఖారి బాబా దర్గా మహోన్నతమైనది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

 క‌లిసి ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత 

 

 

ఇబ్రహీంపట్నం: కుల, మతాలకు అతీతంగా నిర్వహించే షాబుఖారి బాబా దర్గా ఉరుసు ఎంతో మహోన్నతమైనదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కొండపల్లిలొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 429 వ ఉరుసు మహోత్సవాలకు మంగ‌ళ‌వారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్, టిడిపి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ల‌తో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబా ఆశీస్సులు పొందారు. ఆ త‌ర్వాత భ‌క్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందంగా వుందన్నారు. ఉరుసు మహోత్సవానికి ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ స‌హ‌కారంతో భ‌క్తుల ఏటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని ప్రశంసించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్య‌క్ర‌మం టిడిపి కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి జంపాల సీతారామ‌య్య‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ అక్క‌ల గాంధీ, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పైజాన్ ల‌తోపాటు ఎన్డీయే కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మళ్లీ అవే సమాధానాలు.
  మళ్లీ అవే సమాధానాలు వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల...
By Pagadala Venkateswar 2026-05-08 05:34:48 0 105
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 301
Andhra Pradesh
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.లక్ష.. పూర్తి వివరాలు ఇవే..
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన...
By SivaNagendra Annapareddy 2025-12-15 05:28:12 0 270
Telangana
మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి
మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి ఈనెల 14న మందమర్రి ఏరియాలో అంబేద్కర్ 135వ జయంతి...
By Pinnehasan Odela 2026-04-09 14:35:06 0 194
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని...
By Kothuru Murali 2026-04-04 06:13:48 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com