ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్ వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు

0
163

*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*

 

 

షాబుఖారి బాబా దర్గా మహోన్నతమైనది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

 క‌లిసి ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే వ‌సంత 

 

 

ఇబ్రహీంపట్నం: కుల, మతాలకు అతీతంగా నిర్వహించే షాబుఖారి బాబా దర్గా ఉరుసు ఎంతో మహోన్నతమైనదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కొండపల్లిలొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 429 వ ఉరుసు మహోత్సవాలకు మంగ‌ళ‌వారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్, టిడిపి జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ల‌తో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఘనంగా సన్మానించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బాబా ఆశీస్సులు పొందారు. ఆ త‌ర్వాత భ‌క్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన షాబుఖారీ బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందంగా వుందన్నారు. ఉరుసు మహోత్సవానికి ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీ స‌హ‌కారంతో భ‌క్తుల ఏటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారని ప్రశంసించారు. ప్రతిరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్య‌క్ర‌మం టిడిపి కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి జంపాల సీతారామ‌య్య‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ అక్క‌ల గాంధీ, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పైజాన్ ల‌తోపాటు ఎన్డీయే కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
NATIONAL ROAD SAFETY UPDATE 2025: PROJECTIONS INDICATE CRITICAL NEED FOR BEHAVIORAL CHANGE AMID RISING HIGHWAY FATALITIES
  December 25, 2025 — As the calendar year 2025 draws to a close, preliminary data...
By Venugopal Gopal 2025-12-25 01:49:12 0 595
Telangana
పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ...
By Sidhu Maroju 2025-11-18 09:12:14 0 213
Andhra Pradesh
తిరునాళ్ళలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా పోలీస్ అధికారులు.
  బాపట్ల జిల్లా: బాపట్ల ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్...
By Gadiyapudi Narendra 2026-02-17 16:05:42 0 205
Karnataka
Karnataka Government Eyes Quantum Economy with 20 B USD Action Plan
Karnataka has unveiled a visionary Quantum Action Plan to position the state as a leader in...
By Bharat Aawaz 2025-07-17 06:42:32 0 1K
Telangana
ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు...
By Bharat Aawaz 2025-08-12 12:57:28 0 896
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com