గుంటూరు విద్యార్థులలో మాదకద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు. గుంటూరు రేంజ్ ఐడి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు సంకల్ప కార్యక్రమం నీర్వహించారు.

0
400

గుంటూరు జిల్లా పోలీస్...* *30.12.2025* _*// "సంకల్పం" కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్న గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు,.//*_ 🚩 గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్ గారు మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, సంకల్పం కార్యక్రమం ద్వారా గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ❇️ ఈ కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్ నాశనం అవుతుందని, చదువుపై ఏకాగ్రత కోల్పోయి పరీక్షల్లో విఫలమవుతారని, ఉన్నత చదువుల్లో రాణించలేరని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా, వారికి మనోవేదన కలిగించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని విద్యార్థులకు సూచించారు. ❇️ సరదా కోసం లేదా ఆకతాయి తనంతో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని, మొదట అలవాటుగా మొదలై తరువాత వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. 👉 ఈ అవగాహన కార్యక్రమాలలో * ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు, ఇతర పోలీస్ అధికారులు KL యూనివర్సిటీ నందు * సౌత్ డిఎస్పీ శ్రీమతి భానోదయ గారు, వట్టి చెరుకూరు సీఐ రామా నాయక్ గార్లు మలినేని కాలేజీ, పుల్లడిగుంట మరియు ప్రియదర్శిని కాలేజీ, 5వ మైలు నందు * వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు, ఎస్సై రాంబాబు గార్లు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలని నందు విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ❇️ గుంటూరు జిల్లా పోలీస్ శాఖ యువత భవిష్యత్తును పరిరక్షించడమే లక్ష్యంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు నిరంతరం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాథ్ గారి సతీమణి కేశినేని జానకి లక్ష్మి మహిళల స్వాలమనే లక్ష్యం
ప్ర‌చుర‌ణార్థం 19-12-2025     మహిళల స్వావలంబనే లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్...
By Rajini Kumari 2025-12-20 14:22:32 0 148
Andhra Pradesh
అన్న క్యాంటీన్ వద్ద షెడ్ నిర్మాణం చేయాలి: బేబినాయన
అన్న క్యాంటీన్ ముందు భోజనాలు చేసేందుకు శాశ్వతంగా షెడ్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-03-14 14:04:46 0 122
Andhra Pradesh
మదనపల్లిలో విషాదం: ఆపరేషన్ వికటించి తల్లి, బిడ్డ మృతి.
మదనపల్లిలోని సన్ షైన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి...
By Pagadala Venkateswar 2026-03-08 06:49:23 0 89
Andhra Pradesh
పుంగనూరు:శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో రక్తదానం శిబిరం జరిగినది, రక్తదానం చేసి ప్రాణదాతలు కండి.
పుంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-01-30 15:13:46 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com