గుంటూరు జిల్లా నారాకోడూరు లో ఆధిపత్య పోరు కోసం వ్యక్తిని నరికి చంపిన దుండగులు.

0
372

*కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి, పొన్నూరు నియోజకవర్గం.. నారాకోడూరులో ఆధిపత్యం కోసం దారుణం!* *ఆంద్రప్రదేశ్, పొన్నూరు* ఆధిపత్యం కోసం అడ్డుతొలగించుకున్నారు. పెత్తనం కావాలంటే ప్రత్యర్ధులు ఉండకూడదనుకున్నారు. కాపు కాసి కిరాతకంగా హత్య చేశారు నారాకోడూరులోని ఎస్సీ కాలనీకి చెందిన రమణయ్య – రమేష్ కుటంబాల మధ్య ఎప్పటి నుండో విబేధాలున్నాయి. రమేష్ కుటుంబం టీడీపీలో ఉండగా గతంలో రమణయ్య కుటుంబం వైసీపీలో ఉండేది. గత ఎన్నికల్లో రమేష్ ఎంపీటీసీగా గెలుపొందారు. అప్పటి నుండి రెండు కుటుంబాల మధ్య మరింతగా విబేధాలు పొడచూపాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రమణయ్య కుటుంబం కూడా టీడీపీలో చేరిపోయింది. రెండు కుటుంబాల ప్రస్తుతం టీడీపీలోనే ఉంటున్నాయి. అయితే కాలనీలో రమేష్ కుటుంబ పెత్తనమే సాగుతుంది. ఈ క్రమంలోనే రమణయ్య కుటుంబ సభ్యులు రమేష్ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. కాలనీలో తమ పెత్తనం సాగాలంటే రమేష్ కుటుంబంలో కీలకంగా ఉన్న మృత్యుంజయరావును అడ్డుతొలగించుకోవాలని అనుకున్నారు. మృత్యుంజయరావు గజవెల్లి స్పిన్నింగ్ మిల్లులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు పని అయిపోయాక స్పిన్నింగ్ మిల్లు నుండి ఇంటికి బైక్‌పై వచ్చేవాడు. దీన్ని ఆసరగా చేసుకొని ప్రత్యర్ధులు అతడిని అంతం చేయాలని ప్లాన్ చేశారు. రెండు రోజుల క్రితం మిల్లు నుండి ఇంటికి బైక్‌పై బయలుదేరినమృత్యుంజయరావును నారా కోడూరు సమీపంలో కారుతో ఢీ కొట్టారు. బైక్‌పై నుండి కిందపడిన అతడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన మృత్యుంజయరావు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్య కాలనీలో కలకలం రేపింది. ప్రత్యర్ధులను గ్రామం నుండి బహిష్కరించాలంటూ రమేష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఆధిపత్యం కోసమే హత్య జరిగినట్లు చెప్పారు. కారులో పారిపోతున్న ప్రత్యర్ధులను గుర్తించి అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు సీ క్యాంప్ రైతు బజార్ కి ఈ రోజు సెలవు !!
కర్నూలు : నేడు కర్నూలు సీ క్యాంప్ రైతుబజారులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం :సి.క్యాంపు...
By Hari Krishna 2025-12-26 00:36:41 0 209
Sports
Premier League Title Race Pushed to the Absolute Wire
An absolute thriller is unfolding in the English Premier League as today’s high-stakes...
By Dunna Jessicaruth 2026-05-20 05:39:45 0 69
Telangana
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు...
By Sidhu Maroju 2025-12-07 14:40:03 0 280
Andaman & Nikobar Islands
Great Nicobar: India’s Strategic Gateway to the Indian Ocean
The ₹91,000 crore Great Nicobar Island Development Project (GNIDP) represents a monumental shift...
By Lokeshwari Panthadi 2026-06-29 06:47:49 0 40
Telangana
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీ
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అలిమ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో చిలుకూరు మండల సమగ్ర శిక్ష ఉపాధ్యాయ...
By Nookapangu Manikanta 2026-05-23 11:44:49 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com