గుంటూరు జిల్లా నారాకోడూరు లో ఆధిపత్య పోరు కోసం వ్యక్తిని నరికి చంపిన దుండగులు.

0
284

*కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి, పొన్నూరు నియోజకవర్గం.. నారాకోడూరులో ఆధిపత్యం కోసం దారుణం!* *ఆంద్రప్రదేశ్, పొన్నూరు* ఆధిపత్యం కోసం అడ్డుతొలగించుకున్నారు. పెత్తనం కావాలంటే ప్రత్యర్ధులు ఉండకూడదనుకున్నారు. కాపు కాసి కిరాతకంగా హత్య చేశారు నారాకోడూరులోని ఎస్సీ కాలనీకి చెందిన రమణయ్య – రమేష్ కుటంబాల మధ్య ఎప్పటి నుండో విబేధాలున్నాయి. రమేష్ కుటుంబం టీడీపీలో ఉండగా గతంలో రమణయ్య కుటుంబం వైసీపీలో ఉండేది. గత ఎన్నికల్లో రమేష్ ఎంపీటీసీగా గెలుపొందారు. అప్పటి నుండి రెండు కుటుంబాల మధ్య మరింతగా విబేధాలు పొడచూపాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రమణయ్య కుటుంబం కూడా టీడీపీలో చేరిపోయింది. రెండు కుటుంబాల ప్రస్తుతం టీడీపీలోనే ఉంటున్నాయి. అయితే కాలనీలో రమేష్ కుటుంబ పెత్తనమే సాగుతుంది. ఈ క్రమంలోనే రమణయ్య కుటుంబ సభ్యులు రమేష్ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. కాలనీలో తమ పెత్తనం సాగాలంటే రమేష్ కుటుంబంలో కీలకంగా ఉన్న మృత్యుంజయరావును అడ్డుతొలగించుకోవాలని అనుకున్నారు. మృత్యుంజయరావు గజవెల్లి స్పిన్నింగ్ మిల్లులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు పని అయిపోయాక స్పిన్నింగ్ మిల్లు నుండి ఇంటికి బైక్‌పై వచ్చేవాడు. దీన్ని ఆసరగా చేసుకొని ప్రత్యర్ధులు అతడిని అంతం చేయాలని ప్లాన్ చేశారు. రెండు రోజుల క్రితం మిల్లు నుండి ఇంటికి బైక్‌పై బయలుదేరినమృత్యుంజయరావును నారా కోడూరు సమీపంలో కారుతో ఢీ కొట్టారు. బైక్‌పై నుండి కిందపడిన అతడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన మృత్యుంజయరావు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్య కాలనీలో కలకలం రేపింది. ప్రత్యర్ధులను గ్రామం నుండి బహిష్కరించాలంటూ రమేష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఆధిపత్యం కోసమే హత్య జరిగినట్లు చెప్పారు. కారులో పారిపోతున్న ప్రత్యర్ధులను గుర్తించి అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్లు వేసేది ఎప్పుడు మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు...? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామం నుండి గొంటూవానిపాలెం...
By BABJI DADALA 2026-01-23 12:06:37 0 245
Andhra Pradesh
గూడూరు నగర పంచాయతీ నందు ఇటు ఈద్గా నగర్..అటు సింగనిగేరి. తెలుగు వీధి శాంతినగర్ కాలనీ. లో. భారీ వర్షం - ఇళ్లలో కి నీరు
ఇటు ఈద్గా నగర్..అటు సింగనిగేరి. తెలుగు వీధి శాంతినగర్ కాలనీ. లో. భారీ వర్షం - ఇళ్లలో కి నీరు...
By mahaboob basha 2025-09-12 00:48:49 0 429
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం ంల:ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్లు: మార్కెట్ కమిటీ చైర్మన్
అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట గ్రామంలో బుధవారం పెన్షన్ పంపిణీ సందర్భంగా మార్కెట్ కమిటీ...
By Kothuru Murali 2026-04-01 06:14:14 0 68
Bharat Aawaz
Article 8 – Citizenship for Indians Living Abroad “Indian by origin. Citizen by choice.”
What is Article 8 All About? Article 8 of the Indian Constitution offers citizenship rights to...
By Bharat Aawaz 2025-07-02 06:08:38 0 1K
Andhra Pradesh
మదనపల్లె: పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి – కలెక్టర్.
మదనపల్లెలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పన్నుల వసూళ్లపై...
By Pagadala Venkateswar 2026-03-21 06:07:23 0 95
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com