గుంటూరు జిల్లా నారాకోడూరు లో ఆధిపత్య పోరు కోసం వ్యక్తిని నరికి చంపిన దుండగులు.

0
210

*కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి, పొన్నూరు నియోజకవర్గం.. నారాకోడూరులో ఆధిపత్యం కోసం దారుణం!* *ఆంద్రప్రదేశ్, పొన్నూరు* ఆధిపత్యం కోసం అడ్డుతొలగించుకున్నారు. పెత్తనం కావాలంటే ప్రత్యర్ధులు ఉండకూడదనుకున్నారు. కాపు కాసి కిరాతకంగా హత్య చేశారు నారాకోడూరులోని ఎస్సీ కాలనీకి చెందిన రమణయ్య – రమేష్ కుటంబాల మధ్య ఎప్పటి నుండో విబేధాలున్నాయి. రమేష్ కుటుంబం టీడీపీలో ఉండగా గతంలో రమణయ్య కుటుంబం వైసీపీలో ఉండేది. గత ఎన్నికల్లో రమేష్ ఎంపీటీసీగా గెలుపొందారు. అప్పటి నుండి రెండు కుటుంబాల మధ్య మరింతగా విబేధాలు పొడచూపాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రమణయ్య కుటుంబం కూడా టీడీపీలో చేరిపోయింది. రెండు కుటుంబాల ప్రస్తుతం టీడీపీలోనే ఉంటున్నాయి. అయితే కాలనీలో రమేష్ కుటుంబ పెత్తనమే సాగుతుంది. ఈ క్రమంలోనే రమణయ్య కుటుంబ సభ్యులు రమేష్ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. కాలనీలో తమ పెత్తనం సాగాలంటే రమేష్ కుటుంబంలో కీలకంగా ఉన్న మృత్యుంజయరావును అడ్డుతొలగించుకోవాలని అనుకున్నారు. మృత్యుంజయరావు గజవెల్లి స్పిన్నింగ్ మిల్లులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు పని అయిపోయాక స్పిన్నింగ్ మిల్లు నుండి ఇంటికి బైక్‌పై వచ్చేవాడు. దీన్ని ఆసరగా చేసుకొని ప్రత్యర్ధులు అతడిని అంతం చేయాలని ప్లాన్ చేశారు. రెండు రోజుల క్రితం మిల్లు నుండి ఇంటికి బైక్‌పై బయలుదేరినమృత్యుంజయరావును నారా కోడూరు సమీపంలో కారుతో ఢీ కొట్టారు. బైక్‌పై నుండి కిందపడిన అతడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన మృత్యుంజయరావు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్య కాలనీలో కలకలం రేపింది. ప్రత్యర్ధులను గ్రామం నుండి బహిష్కరించాలంటూ రమేష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఆధిపత్యం కోసమే హత్య జరిగినట్లు చెప్పారు. కారులో పారిపోతున్న ప్రత్యర్ధులను గుర్తించి అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు

Search
Categories
Read More
Telangana
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!   అమెరికాలో కారు లోయలో...
By Pinnehasan Odela 2025-12-29 14:58:26 0 116
Bharat Aawaz
⚖️ When Justice Fails: The Chilling Story of Suresh, the Innocent Villager Jailed for a Crime That Never Happened
In the heart of Karnataka, a terrifying example of justice gone wrong unfolded one that shook...
By Citizen Rights Council 2025-07-07 11:35:05 0 2K
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వెలుగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉద్యోగి అనుమానస్పద మృతి
దోర్నాలలోని వెలిగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉపాధిహామీ కార్యాలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకొని...
By Chennaiah Kati 2026-02-04 13:22:21 0 101
Andhra Pradesh
విశాఖ లో జన తా వారిధి
విశాఖ పట్నం కలెక్టరేట్ వద్ద సోమ వారం ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు బీజేపీ నాయకులు జనతా...
By Mobbu Venkatramana 2026-01-19 13:18:07 0 500
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com