RCM చర్చ్ సందర్శించినMP కేశినేని శివనాద్

0
190

*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025* 

 

ఆర్.సి.ఎమ్ చ‌ర్చ్ ను సంద‌ర్శించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ 

బిష‌ప్ జోస‌ప్ రాజారావు కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు 

 

విజ‌య‌వాడ : తూర్పు నియోజ‌క‌వర్గం స్టేల్లా కాలేజీ రోడ్డులోని మాతా ట‌వ‌ర్స్ ప‌క్క‌న గ‌ల ఆర్.సి.ఎం చ‌ర్చ్ ను సోమ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ సంద‌ర్శించారు. బిష‌ప్ జోస‌ప్ రాజారావు, వికార్ జనరల్ పాద‌ర్ మువ్వ‌ల ప్ర‌సాద్ చ‌ర్చ్ కు విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు పుష్ప‌గుచ్ఛం అందించి శాలువాతో ఆత్మీయ‌ స‌త్కారం చేశారు. 

 

“సమాజంలో మానవత్వం, సహనం, సౌహార్దాన్ని పెంపొందించడంలో చర్చిల సేవలు ఎనలేనివి. ప్రజల మధ్య ఐక్యతను బలోపేతం చేసే కార్యక్రమాలు అభినందనీయం. రాబోయే నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, సంతోషాన్ని నింపాలి” అంటూ బిష‌ప్ జోస‌ప్ రాజారావు కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

 

 

“ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోతూ పనిచేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ సేవా దృక్పథం ప్రశంసనీయం. ఆయనకు దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలి” అంటూ బిష‌ప్ జోస‌ప్ రాజారావు ఆకాంక్షించారు. అనంతరం బిష‌ప్ జోస‌ప్ రాజారావు తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. 

 

అనంతరం వీరిద్ద‌రూ సమాజాభివృద్ధి, యువతకు నైతిక విలువల బోధన, సేవా కార్యక్రమాల విస్తరణ అంశాలపై కాసేపు చర్చించుకున్నారు. ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమానికి తన వంతు మద్దతు కొనసాగుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ స్ప‌ష్టం చేశారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియ‌న్ సెల్ అధ్య‌క్షుడు ఊర్ల మోహ‌న‌రావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ క్రిస్టియ‌న్ నాయ‌కులు ఇత్త‌డి చార్లెస్, చాట్ల రాజశేఖ‌ర్, డాక్ట‌ర్ సంకే విశ్వ‌నాథం, ఎన్.ఐ.ఆర్.డి ఎన్టీఆర్ జిల్లా అర్బ‌న్ కో-ఆర్డినేట‌ర్ వ‌ల్ల‌భ‌నేని న‌ర‌సింహా చౌద‌రి, మాజీ కార్పొరేట‌ర్ ఇత్త‌డి నాగ‌ల‌క్ష్మీ, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
దంతాలపల్లి మండలం రేపుని గ్రామం లో ఐకెపి సెంటర్ ప్రారంభించిన గ్రామ నాయకులు మరియు మండలం నాయకులు
ఈరోజు దంతాలపల్లి మండలంలోని *రేపోణీ మరియు గున్నేపల్లి* గ్రామంలో *ప్రభుత్వ విప్ డోర్నకల్...
By Midathapalli Kiran Kumar 2026-04-26 06:43:35 0 265
Andhra Pradesh
అంబేద్కర్ జయంతి సందర్భంగా చీరాల మ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
టిటిడి కళ్యాణ మండపం నుండి ర్యాలీ గా వెళ్లి ముక్కోనపు పార్కు, పేరాల ఈపురుపాలెం తోటవారిపాలెం...
By Vadlamudi NagaVenkat 2026-04-14 11:55:24 0 203
Telangana
మరిపెడ సంక్రాతి వేడుకలో.. పాల్గొన్న... డిప్యూటీ స్పీకర్
*మరిపెడ మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలలో పాల్గొని, ముగ్గుల పోటీలను...
By CM_ Krishna 2026-01-14 17:41:40 0 422
Telangana
ఊరు ఊర అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
27-032026ఊరు ఊర అంగరంగవైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ...
By MERIGE MALLESH 2026-03-27 11:19:09 0 289
Andhra Pradesh
భార్యపై భర్త కిరాతకం: న్యాయం కోసం బాధితురాలి ఆవేదన.
మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారిపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి అనే...
By Pagadala Venkateswar 2026-02-03 06:10:23 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com