CPIM నేతలు నక్కపల్లి ప్రజల అక్రమ అరెస్టుల ఖండన

0
117

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిట:        

విజయవాడ,

తేది : 29 డిసెంబర్‌, 2025.

బంద్‌పై తీవ్ర నిర్బంధం

సిపిఐ(యం) నేతలు, నక్కపల్లి ప్రజల అక్రమ అరెస్టులకు ఖండన

 రైతు నాయకులు, సిపిఐ(యం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజుపై పిడి యాక్ట్‌ పెట్టి అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు అనకాపల్లి జిల్లా ఎస్‌ రాయవరం, నక్కపల్లి మండలాల్లో జరిగిన బందులో పాల్గొన్న సిపిఐ(యం) శ్రేణులను, సాధారణ ప్రజలపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్ట్‌లు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిరచారు. ఎస్‌ రాయవరం పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న నాయకులను కలసుకొని సంఫీుభావం ప్రకటించారు.

 అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజల తరపున నిలబడి పోరాడుతున్న అప్పలరాజును చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడమే కాకుండా దానికి నిరసనగా బంద్‌ పాటిస్తున్న ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం, నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. రైతుల భూములను అక్రమంగా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి వారు చట్టాలను తుంగలో తొక్కి అధికారం దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. విశాఖ ఉక్కును తాకట్టు పెట్టి నక్కపల్లి ప్రాంతంలో రసెల్‌ మిత్తల్‌ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం తాపత్రయం పడుతున్నది. బల్క్‌ డ్రగ్‌ పార్కు కు వ్యతిరేకంగా పోరాడుతున్న రాజయ్యపేట గ్రామస్తులను మభ్యపెట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని చేస్తున్నారు. బల్క్‌ డ్రగ్‌ ఫ్యాక్టరీని పెట్టబోమని నోటి మాటగా హామీ ఇచ్చినా ముఖ్య మంత్రి ఆ మేరకు నోటిఫికేషన్‌ ను ఉపసంహరించు కోక పోవడం వారి కపట నీతిని ఎత్తిచూపుతున్నది. వారి కుట్రలకు అడ్డుగా నిలుస్తున్నారని కక్షతోనే అప్పలరాజుపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు. 

 అరెస్ట్‌ అయిన వారిలో సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఆర్‌.శంకర్రావు, గంటా శ్రీరామ్‌, గనిశెట్టి సత్యనారాయణ, వి.వి. శ్రీనివాసరావు, డి.సత్తిబాబు, ఎం.రాజేష్‌, ఆర్‌.రాము, జి.దేముడు నాయుడు, రామకృష్ణ, డి.డి.వరలక్ష్మి, డి.మాణిక్యం, కాశి తదితరులు ఉన్నారు. తక్షణం వారిని విడుదల చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 నిర్బంధాన్ని అధిగమించి బంద్‌ను జయప్రదం చేసిన కార్యకర్తలకు, వివిధ పార్టీలకు, ప్రజాసంఘాలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియచేస్తున్నది.

 

Search
Categories
Read More
Andhra Pradesh
సెయింట్ మార్క్స్ సెంటెనరీ లూథరన్ చర్చిలో  నిర్వహించిన ప్రత్యేక క్రిస్మస్ వేడుకల్లో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు సతీమణి శిరీష కుమారి గారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
చీరాల: యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని  సెయింట్ మార్క్స్ సెంటెనరీ...
By Gadiyapudi Narendra 2025-12-26 14:46:37 0 172
Madhya Pradesh
Ratlam Car Fraud CM Orders Immediate Police Action
Chief Minister Dr. Mohan Yadav has directed immediate police action following a youth’s...
By Pooja Patil 2025-09-13 10:35:46 0 312
Andhra Pradesh
రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని ప్రోత్సహించాలని, హాస్పిటల్ సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి కోరారు.
చీరాల : రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని...
By Gadiyapudi Narendra 2026-01-19 14:59:07 0 151
Andhra Pradesh
రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం షాపు. పెడుతున్నారని మహిళ ల ఆందోళన
విశాఖ పట్నం నరసింహ నగర్‌లో ఓ వ్యక్తి మద్యం షాపు పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాడని...
By Mobbu Venkatramana 2026-02-13 04:31:22 3 751
Andhra Pradesh
రేపు ఉదయం నుంచి మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్
*రేపు ఉదయం నుంచే మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ టోర్నమెంట్*    *నారా లోకేష్...
By Rajini Kumari 2025-12-20 13:44:42 0 131
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com