కాదంతోక్కి కదలిరండి..... జర్నలిస్టుల భద్రతే లక్ష్యం

0
154

రాష్ట్ర కన్వీనర్లు పర్కాల సమ్మయ్య గౌడ్, 

బజ్జుర్ల శ్రీనివాస్.

జనవరి 5న హైదరాబాద్ ఉప్పల్లో ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర కమిటీ ఎన్నికలు.

జనవరి 5 రాష్ట్ర కమిటీ ఎన్నిక:

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా సమావేశం:

తెలంగాణ 33 జిల్లాల జర్నలిస్టులకు ఆహ్వానం:

జర్నలిస్టులపై దాడులు – భద్రత – రక్షణపై విస్తృత చర్చ

సంక్షేమం కోసం దిశానిర్దేశం చేసే కీలక సమావేశం:

జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు జనవరి 5 తేదీన జరగనున్నాయి. 

ఈ సందర్భంగా హైదరాబాదులో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్లు పర్కాల సమ్మయ్య గౌడ్, బజ్జుర్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి 33 జిల్లాలకు చెందిన జర్నలిస్టులు అందరూ ఈ సమావేశానికి హాజరై, తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, ఎదురవుతున్న సవాళ్లు, భద్రతా లోపాలు, రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కులంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

ఈ సమావేశం కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా, జర్నలిస్టులు ఎలా భద్రంగా ఉండాలి, సంక్షేమ పథకాలు ఎలా అమలు కావాలి, దాడుల సమయంలో సంస్థగా ఎలా స్పందించాలి వంటి అంశాలపై సలహాలు–సూచనలు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక అని తెలిపారు.

జర్నలిస్టులపై జరిగే అన్యాయాలను ప్రశ్నించడంలో, భద్రతకు కండగా నిలబడడంలో ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్ ఎప్పుడూ ముందుంటుందని, అందుకు బలమైన రాష్ట్ర కమిటీ అవసరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మహాకవి శ్రీ శ్రీ మాటలను గుర్తు చేస్తూ..!

“పోరాడితే పోయేదేమీ లేదు,

పోరాడకపోతే లక్ష్యాన్ని చేరలేవు”

అని పేర్కొంటూ, జర్నలిస్టుల హక్కులు, భద్రత కోసం కదంతోకి కదిలి రావాలని, ప్రతి జర్నలిస్టు తన అభిప్రాయాలు, సూచనలు ఈ సమావేశంలో వ్యక్తపరచాలని రాష్ట్ర కన్వీనర్లు పిలుపునిచ్చారు.

అడక్ కమిటీ సభ్యులు:

 ఫోన్ నెంబర్స్:

పర్కాల సమ్మయ్య గౌడ్ 

+918332022212:

994870110:

బజ్జుర్ల శ్రీనివాస్

+91 97058 52875..

ఆహ్వానం: జర్నలిస్టుల భద్రతే లక్ష్యం - కదంతొక్కి కదిలిరండి!

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సంక్షేమం మరియు రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న "ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్" తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల పాత్రికేయ మిత్రులందరికీ ఇదే మా సాదర ఆహ్వానం! సమావేశ వివరాలు:

 తేదీ: జనవరి 5, 2025

 వేదిక: ఉప్పల్, హైదరాబాద్.

 ముఖ్య ఉద్దేశం: రాష్ట్ర కమిటీ ఎన్నిక మరియు జర్నలిస్టుల రక్షణపై కీలక చర్చ.

 ఈ సమావేశం ఎందుకు ముఖ్యం.?

ఈ వేదిక కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా, జర్నలిజం రంగంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లపై గళం విప్పేందుకు ఒక శక్తివంతమైన వేదిక: భద్రత రక్షణ: నిరంతరం జరుగుతున్న దాడుల నుండి జర్నలిస్టులను ఎలా కాపాడుకోవాలి.? సంక్షేమం: ప్రభుత్వ పథకాలు మరియు సంక్షేమ ఫలాలు ప్రతి జర్నలిస్టుకు అందేలా చేసే దిశానిర్దేశం.

 ఐక్యత: దాడులు జరిగినప్పుడు ఒకే తాటిపై నిలబడి సంస్థాగతంగా ఎలా స్పందించాలి.?

  నిర్ణయాధికారం: బలమైన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం ద్వారా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం. పోరాడితే పోయేదేమీ లేదు.. పోరాడకపోతే లక్ష్యాన్ని చేరలేవు.!

మహాకవి శ్రీ శ్రీ గారి స్ఫూర్తితో మన హక్కుల కోసం కదలి వద్దాం..!

 సంప్రదించాల్సిన వారు (అడక్ కమిటీ సభ్యులు):

మీ రాకను ధృవీకరించడానికి లేదా మరిన్ని వివరాల కోసం కింది కన్వీనర్లను సంప్రదించండి:

| పేరు | ఫోన్ నంబర్ | పర్కాల సమ్మయ్య గౌడ్ (రాష్ట్ర కన్వీనర్) | +91 83320 22212, 99487 01110 |

బజ్జుర్ల శ్రీనివాస్ (రాష్ట్ర కన్వీనర్) | +91 97058 52875 |

ముఖ్య గమనిక: తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి 33 జిల్లాలకు చెందిన జర్నలిస్టు మిత్రులందరూ తప్పక హాజరై, మీ అమూల్యమైన సూచనలతో ఈ మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటెక్షన్ ఫోర్స్,తెలంగాణ రాష్ట్ర విభాగం.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్స్ ను పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ లో భాగంగా నడి రోడ్డు లో మీద పేరెడ్ నిర్వహించారు.
  >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు    గుంటూరు జిల్లా పోలీస్... తేది :...
By KOTESWARARAO KVSR 2026-01-10 15:40:06 0 163
Andhra Pradesh
అంటువ్యాధుల నియంత్రణను రాష్ట్రస్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు    ...
By Rajini Kumari 2025-12-29 13:11:37 0 72
Andhra Pradesh
కర్నూలు ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులపరిష్కార వేదిక !!
కర్నూలు : కర్నూలు జిల్లా...•  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్...
By Hari Krishna 2025-12-29 10:49:25 0 126
Andhra Pradesh
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు :  ** ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, న్యూఢిల్లీ.. ఇంజినీర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి...
By Hari Krishna 2025-12-22 08:42:23 0 114
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com