పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ !!

0
185

కర్నూలు : కర్నూలు సిటీ : 

ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్  ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచిన ... కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మరియు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారు.  

క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని , పోలీసుల విధి నిర్వహణ ఒత్తిడిని ఎదుర్కోనేందుకు  క్రీడలు ఎంతో దోహదపడుతాయని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు, ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ గారులు తెలిపారు. 

ఈ సంధర్బంగా  ఆదివారం కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  మైదానంలో  సివిల్, ఎఆర్ మరియు ఎపిఎస్పీ  పోలీసులకు నిర్వహించిన  పోలీసు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ను  కర్నూలు జిల్లా ఎస్పీ గారు , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ లు కలిసి  ప్రారంభించారు.  

క్రికెట్ ఆడి సిబ్బందిని  ఉత్సాహపరిచారు. 

జిల్లా సివిల్ , ఎఆర్  పోలీసుల జట్టు కు కెప్టెన్ గా కర్నూలు జిల్లా ఎస్పీ  గారు  వ్యవహరించారు. 

ఎపిఎస్పీ  పోలీసుల జట్టుకు కెప్టెన్ గా ఎపిఎస్పీ 2  వ బెటాలియన్ కమాండెంట్  గారు వ్యవహరించారు. 

ఇరు జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ టీం గా ఎపిఎస్పీ 2 వ బెటాలియన్  పోలీసులు ,  రన్నర్ టీం గా కర్నూలు జిల్లా పోలీసులు  గెలుపొందారు. 

ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ...

కర్నూలు జిల్లా పోలీసులకు, కర్నూలు ఎపిఎస్పీ పోలీసులకు ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు .   

శాంతిభధ్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు ఫిట్ నెస్ తో  ఉండడానికి,  మానసిక నూతనోత్సహాన్ని ఇస్తాయన్నారు. 

క్రీడలతో శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు.  గెలుపు , ఓటములు సహజమన్నారు.

 కర్నూలు ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్  గారు మాట్లాడుతూ...

మొత్తం సంవత్సరం అంతా బందోబస్తు విధులలో ఉండే పోలీసుల ఒత్తిడిని తగ్గించడానికి, ఫిజికల్ ఫిట్ నెస్  ఉంటూ  ప్రజలకు  మేరుగైన  సేవలందించే ఉద్దేశ్యంతో  పోలీసులు బాగా పని చేయాలని ఈ ఫ్రెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించామన్నారు.

ఈ కార్యక్రమంలో   కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ లు ఎస్ . ఎం. భాషా, సుధాకర్ రెడ్డి,  వెంకటరమణ,  సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు, సివిల్, ఎఆర్, ఎపిఎస్పీ , ఎస్డీఆర్ ఎఫ్  పోలీసులు  ఉన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 1.28 కోట్లు పైగా నిధులు మంజూరు
మంగళవారం రాయచోటి నియోజకవర్గం నాకు మంజూరైన గ్రామీణ రహదారులకు సంబంధించింది మండలంలో సిసి రోడ్ల...
By Benguluri Madhubabu 2026-03-17 08:12:31 0 134
Andhra Pradesh
కర్నూలులో దొంగతనాలు !! రెచ్చిపోతున్న దొంగలు
కర్నూలు సిటీ : కర్నూలు నగరంలోని ప్రజా నగర్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజూ రాత్రి మూడు...
By Hari Krishna 2025-12-29 13:52:41 0 173
Andhra Pradesh
విజయవాడ గొల్లపూడి వాసవి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గొల్లపూడి, వాసవి ఫార్మ మార్కెట్ కాంప్లెక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తృతియ...
By Rajini Kumari 2026-01-25 11:04:18 0 130
Andhra Pradesh
మానవత్వం మరచిన కఠినాత్ముడికి మరణశిక్ష పడాలి.... ఎమ్మెల్యే జహ.
మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా...
By Pagadala Venkateswar 2026-02-17 11:49:33 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com