ఆరోగ్యం కాలుష్యరహిత భవితకు సైకిల్ సవారి జిల్లా కలెక్టర్DG లక్ష్మీశ

0
172

*పత్రికా ప్రకటన*

*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 28, 2025*

 

*ఆరోగ్యం, కాలుష్య ర‌హిత భ‌విత‌కు సైకిల్ సవారీ..*

- *పెడ‌ల్ ఫ‌ర్ ఫిట్‌నెస్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలి*

- *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*

 

ఆరోగ్య‌క‌ర జీవితంతో పాటు కాలుష్య ర‌హిత భ‌విష్య‌త్తుకు సైకిల్ స‌వారీ దోహ‌దం చేస్తుందని.. చిన్నారులు, యువత సైక్లింగ్‌ను ఓ ఆనంద‌క‌ర అల‌వాటుగా చేసుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వ‌ర్యంలో ఫిట్ ఇండియా ఆన్ సండేస్ సైకిల్ ర‌న్ కార్య‌క్ర‌మం న‌గ‌రంలోని డా. బీఆర్ అంబేద్క‌ర్ స్మృతివ‌నం వ‌ద్ద జ‌రిగింది. ఇందులో భాగంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సైక్లింగ్‌ను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు 50 మందికిపైగా చిన్నారుల‌తో పాటు క్రీడా శాఖ అధికారులు, సైక్లింగ్ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో క‌లిసి బెంజ్ స‌ర్కిల్‌, పాలీ క్లినిక్ రోడ్డు, పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌, రెడ్ స‌ర్కిల్ మీదుగా దాదాపు 9 కి.మీ. సైక్లింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ శారీర‌క ఆరోగ్యం ఎంత ముఖ్య‌మో మాన‌సిక ఆరోగ్య‌మూ అంతే ముఖ్య‌మ‌ని.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌డంతో పాటు భావిత‌రాల‌కు కాలుష్య ర‌హిత ప‌ర్యావ‌ర‌ణాన్ని వార‌స‌త్వ సంప‌ద‌గా అందించేందుకు ప్ర‌తిఒక్క‌రూ సైక్లింగ్ ను హాబీగా మార్చుకొని ముందుకువెళ్లాలని, ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానమవుతుందని పేర్కొన్నారు. అందుకే అవగాహన పెంచుకొని సైక్లింగ్ ను అభిరుచిగా మార్చుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో డీఎస్‌డీవో కాక‌ర్ల కోటేశ్వ‌ర‌రావు, జిల్లా సైక్లింగ్ అసోసియేష‌న్ స‌భ్యులు సుగుణ‌రావు, కోచ్ రాహుల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Telangana
నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈరోజు...
By Avunoori Mahesh 2026-05-14 10:02:00 0 194
Telangana
పేద కుటుంబనికి అండగా నిలిచినా మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు
మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్...
By Avunoori Mahesh 2026-05-09 05:54:22 0 214
Telangana
వేసవిలో పిల్లలు జర జాగ్రత్త వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రధాన ఉపాధ్యాయుడు యాకయ్య
దంతాలపల్లి ఏప్రిల్ 23 న్యూస్ (భారత ఆవాజ్ ) వేసవి సెలవుల్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని కుమ్మరు...
By Midathapalli Kiran Kumar 2026-04-24 01:58:40 0 356
Telangana
నారాయణపేట జిల్లాలో దారుణ 
భరత్ అవాజ్  సూర్యమోహన్        నారాయణపేట జిల్లాలో దారుణ ...
By Vanmoj Suryamohan 2026-07-24 02:37:00 0 19
Telangana
పెద్దపల్లి : మట్టి మాఫియాను అరికట్టాలని ధర్నా
పెద్దపల్లి : అక్రమ మట్టి రవాణాపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో...
By Sunka Santhosh 2026-06-03 18:33:46 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com