ఆరోగ్యం కాలుష్యరహిత భవితకు సైకిల్ సవారి జిల్లా కలెక్టర్DG లక్ష్మీశ

0
115

*పత్రికా ప్రకటన*

*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 28, 2025*

 

*ఆరోగ్యం, కాలుష్య ర‌హిత భ‌విత‌కు సైకిల్ సవారీ..*

- *పెడ‌ల్ ఫ‌ర్ ఫిట్‌నెస్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలి*

- *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*

 

ఆరోగ్య‌క‌ర జీవితంతో పాటు కాలుష్య ర‌హిత భ‌విష్య‌త్తుకు సైకిల్ స‌వారీ దోహ‌దం చేస్తుందని.. చిన్నారులు, యువత సైక్లింగ్‌ను ఓ ఆనంద‌క‌ర అల‌వాటుగా చేసుకొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వ‌ర్యంలో ఫిట్ ఇండియా ఆన్ సండేస్ సైకిల్ ర‌న్ కార్య‌క్ర‌మం న‌గ‌రంలోని డా. బీఆర్ అంబేద్క‌ర్ స్మృతివ‌నం వ‌ద్ద జ‌రిగింది. ఇందులో భాగంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సైక్లింగ్‌ను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు 50 మందికిపైగా చిన్నారుల‌తో పాటు క్రీడా శాఖ అధికారులు, సైక్లింగ్ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో క‌లిసి బెంజ్ స‌ర్కిల్‌, పాలీ క్లినిక్ రోడ్డు, పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌, రెడ్ స‌ర్కిల్ మీదుగా దాదాపు 9 కి.మీ. సైక్లింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ శారీర‌క ఆరోగ్యం ఎంత ముఖ్య‌మో మాన‌సిక ఆరోగ్య‌మూ అంతే ముఖ్య‌మ‌ని.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌డంతో పాటు భావిత‌రాల‌కు కాలుష్య ర‌హిత ప‌ర్యావ‌ర‌ణాన్ని వార‌స‌త్వ సంప‌ద‌గా అందించేందుకు ప్ర‌తిఒక్క‌రూ సైక్లింగ్ ను హాబీగా మార్చుకొని ముందుకువెళ్లాలని, ఓ మంచి అలవాటు ఎన్నో విజయాలకు సోపానమవుతుందని పేర్కొన్నారు. అందుకే అవగాహన పెంచుకొని సైక్లింగ్ ను అభిరుచిగా మార్చుకోవాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో డీఎస్‌డీవో కాక‌ర్ల కోటేశ్వ‌ర‌రావు, జిల్లా సైక్లింగ్ అసోసియేష‌న్ స‌భ్యులు సుగుణ‌రావు, కోచ్ రాహుల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Search
Categories
Read More
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని...
By Sidhu Maroju 2025-06-21 17:38:24 0 1K
Telangana
అన్నా ఏమైందే నా ఓటు మీ వార్డ్ లోనే ఉంది
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో ఎన్నికల్లో ఓటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ...
By Prashanth Goindla 2026-02-08 06:26:01 0 201
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వెలుగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉద్యోగి అనుమానస్పద మృతి
దోర్నాలలోని వెలిగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉపాధిహామీ కార్యాలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకొని...
By Chennaiah Kati 2026-02-04 13:22:21 0 177
Entertainment
India enter T20 world Cup final
టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌లోకి భారత్‌ 🏏🇮🇳 టీ20 వరల్డ్‌ కప్‌ రెండో...
By G k Nookala 2026-03-05 17:40:08 0 61
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com