ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లపై అవగాహన సదస్సు

0
312

మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి కె. శ్రీనివాసరావు జిల్లాలోని 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న షెడ్యూల్ కులముల బాలబాలికలకు ZPSS (బాలుర) పాఠశాల గూడూరు నందు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ 5 వ తరగతి నుండి 8వ తరగతి చదువుతున్న షెడ్యూల్ కులముల బాలురకు సం. 1000/- షెడ్యూల్ కులముల బాలికలకు రూ.1500/- మరియు 9,10 తరగతులు చదువుతున్న షెడ్యూల్ కులముల బాల బాలికలకు సాలిన 3500 /- (డేస్ స్కాలర్) రెసిడెన్షియల్ విద్యార్థిని విద్యార్థులకు రూ. 7000 / - ప్రభుత్వం స్కాలర్ షిప్ అందించనున్నట్లు మరియు 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలు కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారు మాత్రమే అర్హులని అదేవిధంగా 9 వ తరగతి మరియు 10 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నవారు అర్హులని తెలిపినారు. పూర్తి వివరాల కోసం, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించ వలసిందిగా తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గూడూరు గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
హన్మకొండ లో రికార్డు డ్రంక్ అండ్ డ్రైవ్ రీడింగ్.|
    హైదరాబాద్ :  న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని...
By Sidhu Maroju 2025-12-31 16:35:31 0 118
Andhra Pradesh
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....**
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా...
By Chennaiah Kati 2026-02-19 07:36:31 0 209
Andhra Pradesh
బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు
మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర...
By Pagadala Venkateswar 2026-03-11 04:20:34 0 98
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com