ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కు చెదరని స్థానం

0
223

*ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కుచెదరని స్థానం*

 

*జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను నివాళి*

 

*మైలవరపు బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా రంగా 37వ వర్ధంతి*

విజయవాడ, డిసెంబర్ 26: ప్రజల హృదయాల్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగారావుకు చెక్కుచెదరని స్థానం ఉందని జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం విద్యాధరపురం సితార వి ఎం రంగా చౌక్ సెంటర్లో 44, 45 డివిజన్ల కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురి లావణ్య, తెలుగుదేశం నాయకులు మైలవరపు కృష్ణ, మైలవరపు దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలవేసి ఉదయభాను నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు మరియు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామినేని ఉదయభాను మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా స్వర్గీయ వంగవీటి రంగా నిలిచి ఉన్నారని కొనియాడారు. ఆయన పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేశారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యారని అన్నారు. అనుక్షణం ప్రజల కోసం పరితపించిన మహా నాయకుడు వంగవీటి మోహన రంగాను ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారని అన్నారు. రంగా ఆశయాల సాధనకై కృషి చేస్తామని ఉదయభాను చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు మహదేవు అప్పాజీరావు, బుల్ల విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర, మరుపిళ్ళరాజేష్, అత్తలూరి పెద్దబాబు, ఉమ్మడి చంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు గునుకుల పుల్లయ్య, చింతలపూడి సత్యనారాయణ, మిర్యాల వెంకటేశ్వరరావు, సుంకర కృష్ణ , మైలవరపు వీరబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు రంగా అభిమానులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Chhattisgarh
Bastar’s Transformation: Education Cities Take Shape
Progress reports released today highlight the rapid construction of the ambitious "Education...
By Dunna Jessicaruth 2026-05-15 09:15:20 0 123
Business & Finance
Sikkim Expands Organic Farming and Agri-Exports
Sikkim is strengthening its organic agriculture sector through initiatives that promote...
By Navya Sree 2026-07-02 12:33:07 0 59
Andhra Pradesh
నేరసులపై కఠినంగా పోలీస్ వ్యవస్థ: డిజిపి
గుంటూరు జిల్లాలో పోలీసులు చేపట్టిన తాజా చర్యలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కోర్టుకు...
By John Baji 2025-12-30 12:51:17 0 173
Telangana
హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి కీలక వినతులు.|
"ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదలకు న్యాయం చేయాలని వినతి" మేడ్చల్ మల్కాజ్ గిరి : మల్కాజ్‌గిరి...
By Sidhu Maroju 2026-07-03 10:56:58 0 61
SURAKSHA
Seemant Kumar Singh: Champion of Law and Order Excellence
A distinguished 1996-batch IPS officer of the Karnataka Cadre, serving as Additional Director...
By Lokeshwari Panthadi 2026-07-24 11:26:03 0 5
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com