Mukkoti ekadasi (30-12-2025)

0
449

Mukkoti Ekadasi 2025 ధనుర్మాసం (Dhanurmasam 2025) వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి. శ్రీమహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్రదినం. ముఖ్యంగా ఉత్తర ద్వారం నుంచి ఆ పురుషోత్తముణ్ని దర్శించుకునే పుణ్యదినం. సంవత్సరానికి 12 నెలలు. నెలకు రెండు ఏకాదశులు అంటే మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. కానీ వేటి విశిష్టత వాటిదే! కానీ ఈ 24 ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది, విశిష్టమైనది మాత్రం ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi). దీనినే వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi 2025) అని కూడా పిలుస్తారు.

Mukkoti Ekadasi 2025

ముక్కోటి ఏకాదశి.

 

ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును స్తుతించి.. ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi) అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం. సాధారణంగా ఏకాదశి (Ekadasi) పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా జరుపుకుంటారు. కానీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని మాత్రం సౌరమానం ఆధారంగా జరపుకోవడం విశేషం.

 

సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం సంప్రదాయం. సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగానూ.. దక్షిణాయనం రాత్రి సమయంగా పేర్కొంటారు. అయితే ఉత్తరాయణం - దక్షిణాయనాలకు సంధి కాలంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా పండితులు అభివర్ణిస్తారు. అదే సమయంలో అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi 2025).

 

ఈ ఏకాదశి (Ekadashi) రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి ఆ వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటారట. అదే సంప్రదాయం ప్రకారం శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడం కోసం వైష్ణవ ఆలయాల్లో.. వైకుంఠంతో సమానమైన రత్న మందిరాన్ని నిర్మించి.. ఉత్తర దిక్కుగా స్వామి వారిని దర్శించి తరిస్తారు. దీనిని ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు. మోక్ష ద్వారంగా చెప్పే ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటే చాలు తమ జన్మ పునీతమవుతుందని భావిస్తారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు
చీరాల: చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు రూరల్ సీఐ శేషగిరిరావు గారు వేటపాలెం ఎస్సై జనార్ధన్...
By Gadiyapudi Narendra 2026-03-22 17:25:25 0 104
Andhra Pradesh
Lakshmi Deepika: లక్ష్మీదీపిక ‘డబుల్’ ధమాకా: తెలంగాణ తర్వాత ఏపీ గ్రూప్-1లోనూ స్టేట్ టాపర్!
రెండు రాష్ట్రాల్లోనూ మొదటి ర్యాంకు సాధించిన ఘనత ఉస్మానియాలో ఎంబీబీఎస్.. ఇప్పుడు డిప్యూటీ...
By Pagadala Venkateswar 2026-02-01 08:33:38 0 82
Telangana
మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్ : సభలో బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలి.  జిల్లాల...
By Sidhu Maroju 2025-12-29 13:02:16 0 123
Andhra Pradesh
మదనపల్లి: ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరిన వైసీపీ నేతలు.
మదనపల్లి మండలం సీటీఎం నల్లవీర గంగా భవానీ అమ్మవారిని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, YCP...
By Pagadala Venkateswar 2026-02-04 07:31:24 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com