కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *

0
157

*కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *

*ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న మేకల చిన్న గోపి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 

కూటమి నాయకుల వేధింపులు తాళలేక ఇటీవలే ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన అమరావతి మండలం నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకల చిన్న గోపి కుటుంబ సభ్యులను నేడు వారి ఇంటికి వెళ్లి పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పరామర్శించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ మేకల గోపి మృతి చాలా బాధాకరం, గోపి కుటుంబానికి నంబూరు శంకరరావు ఆర్థిక సహాయం చేశారు పిల్లల చదువుకు మరియు పార్టీ తరుపున అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పై కూటమి నాయకులు వేధింపులకు గురించేస్తున్నారన్నారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉండకుండా వేధింపులతో గ్రామం నుండి వెళ్లగొడుతున్నారని అన్నారు. రాజకీయం అంటే ప్రజలకు దగ్గర అవ్వలి కానీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదు అని తెలిపారు. ఇప్పటికి అయిన పద్ధతి మార్చుకొని ప్రజా పాలన కొనసాగించాలని, నియోజకవర్గం అభివృద్ధి చేయాలనీ సూచించారు. వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు దైర్యం గా ఉండాలని, ఎటువంటి ఆగాయిత్యాలకు పాల్పడవద్దని, మళ్ళీ మన ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మనకు మంచి రోజులు వస్తాయని అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దళితులకు భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసి దళిత నాయకులు
దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు రిలీఫ్లు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసిన దళిత...
By Chennaiah Kati 2026-03-10 13:14:04 0 132
Andhra Pradesh
జెన్ జెడ్ పోస్ట్ ఆఫీసు ప్రారంభం
కర్నూలు! కర్నూలు ధూపాడు సమీపంలో గల కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జన్ జెడ్ పేరుతో...
By Hari Krishna 2025-12-12 09:48:30 2 1K
Andhra Pradesh
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ విజయవాడ, విజయవాడ, తేది : 18...
By Rajini Kumari 2025-12-18 11:51:54 0 149
Andhra Pradesh
చిరు సినిమా టికెట్‌ను రూ.1.11లక్షలకు సొంతం చేసుకున్న అభిమాని
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన...
By Pagadala Venkateswar 2026-01-06 07:29:12 0 163
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com