కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *

0
230

*కూటమి నాయకుల వేధింపులు దుర్మార్గం - గోపి కుటుంబానికి పార్టీ తరుపున అన్ని విధాలా అండగా ఉంటాం - మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు *

*ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న మేకల చిన్న గోపి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 

కూటమి నాయకుల వేధింపులు తాళలేక ఇటీవలే ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన అమరావతి మండలం నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేకల చిన్న గోపి కుటుంబ సభ్యులను నేడు వారి ఇంటికి వెళ్లి పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పరామర్శించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ మేకల గోపి మృతి చాలా బాధాకరం, గోపి కుటుంబానికి నంబూరు శంకరరావు ఆర్థిక సహాయం చేశారు పిల్లల చదువుకు మరియు పార్టీ తరుపున అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల పై కూటమి నాయకులు వేధింపులకు గురించేస్తున్నారన్నారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఉండకుండా వేధింపులతో గ్రామం నుండి వెళ్లగొడుతున్నారని అన్నారు. రాజకీయం అంటే ప్రజలకు దగ్గర అవ్వలి కానీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదు అని తెలిపారు. ఇప్పటికి అయిన పద్ధతి మార్చుకొని ప్రజా పాలన కొనసాగించాలని, నియోజకవర్గం అభివృద్ధి చేయాలనీ సూచించారు. వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు దైర్యం గా ఉండాలని, ఎటువంటి ఆగాయిత్యాలకు పాల్పడవద్దని, మళ్ళీ మన ప్రభుత్వం అధికారం లోకి వచ్చి మనకు మంచి రోజులు వస్తాయని అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, పీఎం కిసాన్ నిధుల విడుదల.
అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37...
By Pagadala Venkateswar 2026-03-13 07:12:58 0 168
Andhra Pradesh
మదనపల్లెలో మురికి కాలువలు, రోడ్ల శుభ్రత: ఎమ్మెల్యే ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 18వ వార్డులో, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ఇంచార్జ్ సయ్యద్...
By Pagadala Venkateswar 2026-04-03 06:00:42 0 176
Telangana
ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు ‎బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం
మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక 'ఇండియా టుడే కాన్‌క్లేవ్'...
By Ponnala Srinivasrao 2026-03-10 05:35:22 0 295
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో...
By John Baji 2025-12-30 12:05:33 0 339
Andhra Pradesh
సివిల్ సప్లయిస్ హమాలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి: AITUC.
అన్నమయ్య జిల్లాలోని సివిల్ సప్లయిస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలకు ఏప్రిల్ నెల వేతనాలు ఇంకా...
By Pagadala Venkateswar 2026-05-22 04:57:17 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com