పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు:డీజీపీ శివధర్ రెడ్డి

0
602

తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి) పోలీసులు తలదూర్చకూడదని, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. *“గీత దాటితే వేటు తప్పదు”* అనే సూక్తి గుర్తుచేస్తూ, *పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలు సెటిల్ చేస్తే ఎవరైనా (హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకూ) బాధ్యుడవుతారని హెచ్చరించారు*. 

 

“సివిల్ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయి. ప్రతి పోలీసుకూ ఇది తెలుసు. అయినా వాటిపై దృష్టి సారించి, *పోలీసు స్టేషన్‌లను సెటిల్మెంట్ సెంటర్లుగా మార్చడం తప్పు. ఇలాంటి ఫిర్యాదులు వస్తే, పార్టీలు/పంచాయితీలకు మళ్లించాలి” అని పేర్కొన్నారు*.

*ప్రస్తుతం వివాదాలను పరిష్కరించిన స్టేషన్లు, అధికారులపై తక్షణమే వేటు (కఠిన చర్యలు) పడుతుంది. ఎస్పీలు, సీపీలు, హోం గార్డులు – ఎవరూ మినహాయింపు లేదు.” అని తెలిపారు*. పోలీసు యూనిఫామ్, అవినీతి కలిసి ఉండకూడదు. అక్రమాలు, నీతి లోపాలపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుంది. మన ప్రవర్తన యూనిఫామ్‌కు గౌరవాన్ని, ప్రభుత్వానికి ప్రతిష్టను, సమాజంలో శాంతిని కల్పించాలి’’ అని కోరారు....

Search
Categories
Read More
Andhra Pradesh
ఈతకు వెళ్లిన యువకుడు మృతి... విషాదం
మదనపల్లె మండలంలో ఆదివారం చీకిలబైలుకు ఈతకు వెళ్లిన యువకుడు సుబ్బిరెడ్డిబావిలో ప్రమాదవశాత్తు నీటిలో...
By Pagadala Venkateswar 2026-04-27 05:42:29 0 82
Andhra Pradesh
రంజాన్ పండుగ: కాంగ్రెస్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్ శుభాకాంక్షలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.రెడ్డీ సాహెబ్, శుక్రవారం, శనివారం...
By Pagadala Venkateswar 2026-03-20 13:53:03 0 162
Telangana
అగ్నివీర్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్/ హైదరాబాద్   నిరుద్యోగులకు మరోసారి శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం....
By Sidhu Maroju 2025-08-02 18:37:23 0 969
Andhra Pradesh
100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను...
By Hari Krishna 2025-12-14 14:03:45 0 292
Andhra Pradesh
పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.
పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని...
By Kothuru Murali 2026-01-24 08:01:48 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com