రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ కార్యాలయం నందు ఘనంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్*

0
156

మాదిగ కార్పొరేషన్ ఆఫీస్‌లో మన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్యాలయం అంతా చక్కగా క్రిస్మస్ డెకరేషన్లు, రంగురంగుల లైట్లు అలంకరించడం జరిగింది . శ్రీదేవి గారు స్వయంగా క్రిస్మస్ ట్రీని అలంకరిస్తూ, అందరికీ ఉత్సాహాన్నిచ్చారు.వేడుకలో క్రిస్మస్ కారల్స్ గానం,కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి.కేక్ కటింగ్ జరుగగా, అందరూ పండుగ ఆహ్లాదాన్ని పంచుకున్నారు. ఆ వేడుకలు కార్యాలయాన్ని ఒక కుటుంబ వాతావరణంగా మార్చాయి.ఈ సందర్బంగా శ్రీదేవి గారు మాట్లాడుతూ, ఈ పండుగ మన అందరి జీవితాలలో శాంతి, ఆనందం నింపాలని, ప్రేమ, దయ, మానవీయతతో మమేకం కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలు ప్రతి ఒక్కరి సహకారంతో విజయవంతమయ్యాయని కృతజ్ఞతలు తెలిపారు.ఇలా మాదిగ కార్పొరేషన్ ఆఫీస్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు అందరికీ ఒక మర్చిపోలేని అనుభూతిని మిగిల్చాయి.ఉండవల్లి శ్రీదేవి గారు చివరిలో అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు,పాస్టర్ దేవ ప్రకాష్ గారు,మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు,ఎస్సీ కార్పొరేషన్ జిఎం కృష్ణవేణి గారు,కూటమి ప్రభుత్వం కార్యకర్తలు,వుండవల్లి శ్రీదేవి గారి అభిమానులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 20, 2025*...
By Rajini Kumari 2025-12-19 09:40:13 0 149
Telangana
న్యూఇయర్‌ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు
హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్‌ బృందం హెచ్చరికలు జారీ...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:38:32 0 218
Andhra Pradesh
సహకార సంస్థల అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా నూతనంగా నియమితులైన శ్రీ కుర్రా అప్పారావు సోమవారం గుంటూరు...
By John Baji 2025-12-30 01:20:59 0 136
Odisha
Odisha Govt Approves Rs 2,500 Crore for Infrastructure Boost in Rural
The Odisha government has sanctioned ₹2,500 crore for major infrastructure development projects...
By Bharat Aawaz 2025-07-17 10:55:47 0 1K
Telangana
చేనేత కార్మిక పారిశ్రామిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ డిమాండ్.
    *చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 25వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాద్...
By Thalakokkula Sadanandam 2026-03-20 09:06:04 0 220
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com