అన్నమయ్య సంకీర్తన తందనాన విజేతలకు సీఎం చంద్రబాబు పథకాలు అందజేత

0
157

*Press Release*

 

*సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు*

 

*అన్నమయ్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేసే శోభారాజు కార్యక్రమాలకు పూర్తి సహకారం*

 

*‘తందనానా’ విజేతలకు పతకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు*

 

*అమరావతి, డిసెంబర్ 23 :-* సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు ''తందనానా - 2025''లో విజేతలైన ముగ్గురు గాయనీ గాయకులకు ముఖ్యమంత్రి బంగారు పతకాలను బహుకరించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాకులో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సబ్‌ జూనియర్‌ విభాగంలో భట్టిప్రోలు మేఘన, జూనియర్‌ విభాగంలో చిర్పల్లి శ్రీమహాలక్ష్మి, సీనియర్‌ విభాగంలో సముద్రాల లక్ష్మీ హరిచందన సీఎం చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ....."సంగీతం, సాహిత్యం, సంస్కృతులే విలువలు నేర్పే సాధనాలు...భారతీయ మూలాలు. భారతీయ సంగీతంతో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యులు. 32 వేల సంకీర్తనలు రచించారు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో అన్నమయ్య కీర్తనలు ఉంటాయి. అన్నమాచార్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశ్యంతో ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్స్‌ ప్రాంతంలో అన్నమయ్యపురం ఏర్పాటు చేశాం. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేసేందుకు గత 42 ఏళ్లుగా కృషి చేస్తున్న అన్నమాచార్య భావనా వాహిని సంస్థను అభినందిస్తున్నా. ‘తందనాన’ పేరుతో అన్నమాచార్య అంతర్జాతీయ సంకీర్తనా పోటీలను శోభారాజు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. భావితరాలకు అన్నమయ్య సంకీర్తనల మాధుర్యాన్ని అందించి... యువ కళాకారులను అత్యున్నత స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు. 12 దేశాల్లో 700పైగా కచేరీలు నిర్వహించారు. అన్నమయ్య కీర్తనలను సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో చెప్పారు. శోభారాజు అన్నమయ్య కీర్తనలకు ఒక బ్రాండ్‌గా నిలుస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లోని అన్నమయ్యపురంను సందర్శిస్తాను"అని ముఖ్యమంత్రి చెప్పారు. 

*******

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్రం : కొత్తగా ఏర్పడిన పెన్షన్లు దరఖాస్తు సిద్ధం సిద్ధం..!
తెలంగాణ రాష్ట్ర ఎట్టకేలకు కొత్త పింఛన్లకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వృద్ధుల పెన్షన్ వితంతులు,...
By Sunka Santhosh 2026-05-23 18:45:52 0 31
Andhra Pradesh
డిసెంబర్ 21వ తేదీన పోలియో డేను విజయవంతం చేద్దాం
*' డిసెంబర్ 21' పోలియో డేను విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యేలు వెనిగండ్ల,వర్ల*   *పోలియో డే...
By Rajini Kumari 2025-12-18 11:20:44 0 191
Andhra Pradesh
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
By Pagadala Venkateswar 2026-01-18 10:36:58 0 163
Telangana
మోండా రూపం మార్చే రోడ్లు – ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో అభివృద్ధికి శ్రీకారం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా...
By Sidhu Maroju 2026-04-15 06:34:21 0 133
Manipur
Inquiry Commission Granted Fifth Extension
The Union Home Ministry has extended the tenure of the Manipur Commission of Inquiry by another...
By Dunna Jessicaruth 2026-05-15 10:18:05 0 54
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com