లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం

0
127

*లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసుల పరిష్కారం* 

 

*మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్‌కు ప్రశంసా పత్రం*

 

గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చేతుల మీదుగా మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ప్రశంసా పత్రం అందుకున్నారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుని, లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసులను పరిష్కారానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ గౌరవం లభించింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, రూరల్ ఎస్సై వెంకట్ అంకితభావం, ప్రజాసేవ పట్ల నిబద్ధతను ప్రశంసించారు. న్యాయ ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు న్యాయం అందేలా చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రశంసా పత్రం అందుకున్న అనంతరం రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ, అంకితభావంతో పనిచేసినందుకే ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ప్రోత్సహించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు, డీఎస్పీ మురళీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజల శాంతి, భద్రతలే లక్ష్యంగా విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-27 11:04:07 0 70
Andhra Pradesh
వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.
మదనపల్లె మండలం, కోళ్ళబైలు పంచాయితీ, అమ్మచెరువుమిట్టలోని వెలుగు వృద్ధాశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్...
By Pagadala Venkateswar 2026-02-11 05:54:56 0 77
Andhra Pradesh
ఏపీ ఈగల్ చీఫ్ ఐ జి పి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు గుంటూరు తక్కెళ్ళపాడు సిబార్ డెంటల్ కాలేజీలో డ్రగ్స్ అవగాహన సదస్సు విద్యార్థులకు తెలియజేశారు.
  >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు...
By KOTESWARARAO KVSR 2026-01-10 15:35:19 0 278
Andhra Pradesh
విశాఖలో మంత్రి లోకేష్ ప్రజల అర్జీలు స్వీకరణ
*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ*...
By Rajini Kumari 2025-12-16 11:24:36 0 216
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com