భార్య సర్పంచ్ అయితే భర్తల పెత్తనం దేనికి.?

0
178

హైదరాబాద్ :  మహిళా సర్పంచ్‌లున్న గ్రామాల్లో ఇంకా పతి సంస్కృతి కొనసాగుతుందా?

ఈసారి నుంచైనా పతి పంథా మారుతుందా?

అధికారం మహిళా నేతల చేతుల్లోనే ఉంటుందా?

మళ్లీ.. ఊళ్లలో పరోక్షంగా భర్తలే అన్నీ తామై వ్యవహరిస్తారా?

నూతన మహిళా సర్పంచ్  లు ప్రమాణస్వీకారాలు  చేయడంతో గ్రామాల్లో కొత్త చర్చ.

గ్రామ పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్ల వల్ల మహిళలు సర్పంచ్‌లుగా గెలుస్తున్నా, క్షేత్రస్థాయిలో వారి భర్తల ఆధిపత్యం కొనసాగడం ఓ సామాజిక సవాల్‌గా మారింది. ఇకనైనా ఈ పరిస్థితి మారుతుందా? లేదా?

ప్రభుత్వాలు ఇప్పుడు సర్పంచ్ పతి సంస్కృతిపై సీరియస్‌గా ఉన్నాయి. అధికారిక సమావేశాలకు వారికి బదులుగా భర్తలు హాజరైతే.. వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

అయితే.. ఎంతమంది భర్తలు ఈ నిబంధనలను పాటిస్తారనేదే పెద్ద ప్రశ్న.

చెక్ పవర్ మహిళా సర్పంచ్‌లకే ఉంటుంది. సంతకం పెట్టే అధికారం వారిదే కాబట్టి, పరిపాలనపై నియంత్రణ వారిదే ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది.

ఎందుకంటే.. మహిళలు సర్పంచ్‌లుగా గెలిచిన గ్రామాల్లో.. వారి భర్తలే తామే అన్నీ ముందుండి నడిపించాలని చూస్తుంటారు. 

ఎన్నికల ఖర్చు అంతా భర్తలే భరించడం వల్ల, గెలిచిన తర్వాత అధికారం తమదే అన్న ధీమా వారిలో ఉంటోంది. కానీ.. అధికారికంగా, ప్రజలు ఎన్నుకున్నది మహిళలనే. కాబట్టి.. అధికారం కూడా వారి దగ్గరే ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది.

పోలీస్ స్టేషన్లు, మండల ఆఫీసుల చుట్టూ తిరగడం మహిళలకు ఇబ్బందిగా ఉంటుందనే నెపంతో భర్తలు ఆ బాధ్యతలను తీసుకుంటున్నారు. దీనివల్ల తెలియకుండానే పవర్ భర్తల చేతుల్లోకి వెళ్తోంది. కానీ.. ఈ కార్యకలాపాల్లో వారిని కూడా భాగస్వామ్యం చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రజలు కూడా సర్పంచ్‌ను కాకుండా ఆమె భర్తను సంప్రదిస్తే.. ఈ పతి సంస్కృతి ఇలాగే కొనసాగుతుంది. అందువల్ల పరిస్థితుల్లో మార్పు రావాలి. భర్తలు సహాయకులుగా ఉండి, నిర్ణయాధికారం మహిళలకే వదిలేసినప్పుడే.. అసలైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది.

 

sidhumaroju✍️ 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: కృష్ణుడి ఆలయంలో భారీ చోరీ.
మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు....
By Pagadala Venkateswar 2026-02-24 08:01:37 0 128
Andhra Pradesh
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ. మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్...
By Chennaiah Kati 2026-03-10 10:55:30 0 273
Andhra Pradesh
ప్రభుత్వ చలివేంద్రాలు ప్రచార ఆర్భాటమే: సిపిఎం విమర్శ.
మదనపల్లెలో ప్రభుత్వ చలివేంద్రాలు కేవలం ప్రచార ఆర్భాటంగానే మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పి....
By Pagadala Venkateswar 2026-05-18 04:22:14 0 37
Telangana
ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం...
By Prashanth Goindla 2026-02-09 07:19:41 0 296
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com