చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం

0
469

చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించారు. ఏఐటియూసీ యూనియన్ మద్దతుతో జరిగిన ఈ సమావేశంలో జిల్లా నలుమూలల నుండి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఎదురవుతున్న సమస్యలపై, ముఖ్యంగా నివాస స్థలాల విషయమై ఈ సందర్భంగా చర్చించారు.

ప్రభుత్వానికి విన్నపం "మాకు సొంత ఇల్లు కావాలి"

ఈ సమావేశంలో దివ్యాంగుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది దివ్యాంగులకు నివసించడానికి కనీసం సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు స్థానిక శాసనసభ్యులు మద్దూలూరి మాలకొండయ్య వెంటనే స్పందించి, దివ్యాంగులందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

నూతన కమిటీల ఎన్నిక

దివ్యాంగుల హక్కుల సాధన కోసం ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కమిటీలను ఎన్నుకున్నారు

ప్రధాన కమిటీ:

 

 కన్వీనర్: నూకతోటి దత్తాత్రేయ సహాయక కన్వీనర్: యనమల నాగేశ్వరరావు

 అధ్యక్షుడు: పెరికల జోసెఫ్

 సెక్రటరీ: మంత్రు నాయక్

 

 సహాయక కార్యదర్శులు: 

 

మంకెలా ప్రకాష్, పర్వతల ఈశ్వరరావు, వెంకట్రావు, బొందు గురవయ్య, ఎస్.కె. అమీర్ బాషా, నిడమనూరి ప్రవీణ్.

 జాయింట్ సెక్రటరీలు: సుబ్బారావు, గంగారావు, ఎస్.కె. నాగూర్ వలి, సలీం, దొబ్బకోటి లక్ష్మయ్య, పోలయ్య..

మహిళా కమిటీ:మహిళా దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మహిళా కమిటీని ఏర్పాటు చేశారు.అధ్యక్షురాలు: పి. సునీత సెక్రటరీ: ఎస్.కె. కరీమున్ఉపాధ్యక్షురాలు: పింకీ,జాయింట్ సెక్రటరీ: సుసన్న.

ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ ప్రతినిధులు, దివ్యాంగుల సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొని తమ నిరసనను, విన్నపాన్ని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ముక్కోటి మహోత్సవాలు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నెహ్రు నగర్ నందిగామలో స్వామివారి...
By Rajini Kumari 2025-12-30 10:53:01 0 143
Telangana
ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని...
By Sidhu Maroju 2025-06-21 17:38:24 0 1K
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 114
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న _ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు.
గుంటూరు,చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ నందు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహన్...
By John Baji 2026-01-22 11:13:40 0 155
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com