కొత్తబస్తీకి కల్వర్టు- 45 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు.|

0
167

 

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 190 డివిజన్ కొత్త బస్తీ వాసుల జీవితాల్లో ఈ రోజు ఒక గుర్తుండిపోయే రోజు. గత 45 సంవత్సరాలుగా రైల్వే కల్వర్టు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో రూ.1.40 కోట్లతో రైల్వే కల్వర్టు మంజూరైంది.

ఈ శుభవార్త నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెలిమెల మహేష్ ఆధ్వర్యంలో కొత్త బస్తీ వాసులు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

వర్షాకాలంలో నీటి సమస్యలు, రాకపోకల ఇబ్బందులు, అత్యవసర పరిస్థితుల్లో ఎదురయ్యే కష్టాలు ఇక ముగిశాయని బస్తీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.

రైల్వే జనరల్ మేనేజర్ ని పలుమార్లు కలిసి సమస్యను వివరించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే చొరవ వల్లే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జావేద్, ప్రశాంత్ రెడ్డి, మొహమ్మద్ మక్బూల్, మొహమ్మద్ ముక్తార్, సలీం, అజార్ మొహమ్మద్, సలీం తదితరులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Haryana
Heatwave Impact & Education
As a blistering heatwave grips northern India, the Haryana government has announced a state-wide...
By Dunna Jessicaruth 2026-05-16 06:35:13 0 75
Andhra Pradesh
టిడిపి ఎమ్మెల్యే తామస్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు   ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత.. గెలిపించేటప్పుడు...
By Rajini Kumari 2026-04-24 13:22:29 0 129
Telangana
జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి ...
By Sidhu Maroju 2026-01-12 15:08:29 0 193
Andhra Pradesh
సింగిల్ నంబర్ ఆట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోలీసులు.
📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో చట్ట వ్యతిరేక...
By John Baji 2026-01-03 02:09:22 0 179
Andhra Pradesh
ములకలచెరువు: ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన...
By Pagadala Venkateswar 2026-01-31 08:01:08 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com