కొత్తబస్తీకి కల్వర్టు- 45 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు.|

0
138

 

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 190 డివిజన్ కొత్త బస్తీ వాసుల జీవితాల్లో ఈ రోజు ఒక గుర్తుండిపోయే రోజు. గత 45 సంవత్సరాలుగా రైల్వే కల్వర్టు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృషితో రూ.1.40 కోట్లతో రైల్వే కల్వర్టు మంజూరైంది.

ఈ శుభవార్త నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెలిమెల మహేష్ ఆధ్వర్యంలో కొత్త బస్తీ వాసులు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

వర్షాకాలంలో నీటి సమస్యలు, రాకపోకల ఇబ్బందులు, అత్యవసర పరిస్థితుల్లో ఎదురయ్యే కష్టాలు ఇక ముగిశాయని బస్తీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.

రైల్వే జనరల్ మేనేజర్ ని పలుమార్లు కలిసి సమస్యను వివరించి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే చొరవ వల్లే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జావేద్, ప్రశాంత్ రెడ్డి, మొహమ్మద్ మక్బూల్, మొహమ్మద్ ముక్తార్, సలీం, అజార్ మొహమ్మద్, సలీం తదితరులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు,  పరీక్షలు జరిగే...
By Gadiyapudi Narendra 2026-02-17 15:50:05 0 111
Andhra Pradesh
Nirmala Sitharaman Witnessed the signing of  MoUs during the launch of Cyient AI & Future Skills Hub at Digital Bhawan in Pedamainavanilanka (PM Lanka) village in the West Godavari district of Andhra Pradesh.
Nirmala Sitharaman witnessed the signing of  MoUs during the launch of Cyient AI &...
By Gadiyapudi Narendra 2025-12-28 16:49:24 0 202
Andhra Pradesh
పుంగనూరు: డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
గురువారం సాయంత్రం పుంగనూరు మండలం, సుగాలిమిట్ట వద్ద మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న కారులో...
By Kothuru Murali 2026-04-03 09:50:59 0 53
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com