గద్దె అనురాధ చిట్టిబాబులకు ఎంపీ కేసినేని శివనాథ్ శుభాకాంక్షలు

0
137

*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*

 

గ‌ద్దె అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబుల కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు 

 

విజ‌య‌వాడ : ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షురాలుగా నియ‌మితులైన గ‌ద్దె అనురాధ , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మితులైన కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ చెన్నుబోయిన చిట్ట‌బాబుల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆదివారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

 

టిడిపి పట్ల అంకితభావం, ప్రజాసేవలో అనుభవం కలిగిన గద్దె అనురాధ , చెన్నుబోయిన చిట్టి బాబు వీరి నియామ‌కం ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేయ‌టానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశంపార్టీ తొలి మ‌హిళ అధ్య‌క్షురాలిగా నియ‌మితులై గ‌ద్దె అనురాధ చ‌రిత్ర సృష్టించార‌ని కొనియాడారు. గ‌ద్దె అనురాధ నాయ‌కత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ మ‌రింత బ‌లోపేతంగా తయారు చేసేందుకు కృషి చేస్తామ‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కు గ‌ద్దె అనురాధ‌, చిట్టిబాబుల‌ను అధ్య‌క్ష‌, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శులుగా నియ‌మించినందుకు తెలుగుదేశంపార్టీ అధిష్టానంకు, టిడిపి జాతీయ అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... ఒకటి, రెండు గంటల్లోనే శీఘ్ర దర్శనం.
టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి...
By Pagadala Venkateswar 2026-02-04 07:37:14 0 38
Telangana
మెడికవర్ ఆసుపత్రిలో ప్యాంక్రియాటిక్ క్లినిక్ ప్రారంభం.|
సికింద్రాబాద్ : తెలంగాణలో యుక్త వయసులో ఉన్నవారికి ఇటీవల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి...
By Sidhu Maroju 2025-11-14 11:20:45 0 113
Andhra Pradesh
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 04.01.2026*    *• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
By Rajini Kumari 2026-01-04 11:16:48 0 116
Andhra Pradesh
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ::
కర్నూలు : పాణ్యం:  కర్నూలు టౌన్ లో కల్లూరు అర్బన్ 31 వ వార్డు బద్రీనాథ్ నగర్ లో ఎన్టీఆర్...
By Hari Krishna 2025-12-31 11:19:35 0 100
Andhra Pradesh
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త..   ...
By Rajini Kumari 2025-12-17 08:27:13 0 117
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com