ఉచిత విద్యా,వైద్యం ప్రభుత్వ బాధ్యత- ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి*

0
252

భారత కమ్యూనిస్టు పార్టీ 17వ డివిజన్ శాఖ కార్యదర్శి చినపోతుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చాకలికుంటలోని కమ్యూనిస్టు బొమ్మలు సెంటర్లో శంకర కంటి వైద్యశాల వారి సహకారంతో అంధత్వ నివారణ సంస్థ గుంటూరు జిల్లా వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటాలు నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు ఈ విధమైనటువంటి ఉచిత వైద్య సేవలు కూడా నిర్వహిస్తూ అట్టడుగు ప్రజానీకానికి మరింత చేరవుతున్నదని వారు తెలిపారు. ప్రజలకు విద్య వైద్యం ఉచితంగా అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని భారత దేశ రాజ్యాంగంలో కూడా అదే పొందుపరిచి బడినదని కానీ పాలకుల నిర్లక్ష్యం, అవినీతి ఆలోచనలతో విద్య,వైద్యం పూర్తిగా ప్రైవేటుపరం చేస్తున్నారని వారు విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాలలో భాగంగా ఈ విధంగా ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచ్చేసినటువంటి వైద్యుల బృందం ప్రజలకు బిపి,షుగర్, కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, నగర సమితి సభ్యులు చినపోతుల వెంకటరావు, అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 అభినందనలతో,

ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ కార్యదర్శి, గుంటూరు నగర సమితి

@Johnbaji.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే...
By John Baji 2026-01-02 12:57:34 0 194
Bharat Aawaz
“You Are Not Just a Voter – You Are the Owner of This Nation”
Know Your Rights. Use Your Voice. Change Your India.  Why This Article Matters Most people...
By Citizen Rights Council 2025-06-25 11:53:49 0 2K
Andhra Pradesh
బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదు
వృద్ధులకు బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదని జన జాగృతి ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీరపు...
By Boiena Rajesh 2026-04-02 05:16:07 0 203
Lakshdweep
Lakshadweep Ends 47-Year Prohibition: A New Tourism Era
he Union Territory of Lakshadweep has officially entered a transformative chapter with the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:00:38 0 69
Andhra Pradesh
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.
మదనపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు...
By Pagadala Venkateswar 2026-07-01 06:58:19 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com