ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు

0
165

*ప్రవేట్ పాఠశాలల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం*

 

▪️*ఈనెలాఖరులోగా ఆన్లైన్లో చేసుకోవాలన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు*

 

రాష్ట్రంలో రానున్న 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలలను ప్రారంభించేందుకు అనుమతి కోసం ఈనెల 31లోగా cse.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయ్ రామరాజు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల ప్రారంభానికి దరఖాస్తు చేసుకున్నవారికి నిబంధనలననుసరించి అనుమతి మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అనుమతి ఇచ్చిన తర్వాత పాఠశాల ప్రారంభానికి కావాల్సిన సదుపాయాలు, గుర్తింపు తీసుకోవడానికి తగు సమయం అవసరమవుతుందని ఈ నేపథ్యంలో ఆసక్తిగలవారు ఈనెలాఖరులోగా ఆన్లైన్లో ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. అనుమతి ప్రక్రియలో భాగంగా ఎంఈవో, డీఈవోలు పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆ ప్రాంతంలో పాఠశాల అవసరం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించి నివేదిక అంజేయాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో పాఠశాల అవసరాల ప్రకారం నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం
భారతీయ జనతాపార్టీ       ఆంధ్రప్రదేశ్      *స్క్రోలింగ్*...
By Rajini Kumari 2025-12-12 17:23:32 0 250
Andhra Pradesh
చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.
వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి.  చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ...
By John Baji 2026-02-03 03:29:18 0 126
Chhattisgarh
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community...
By BMA ADMIN 2025-05-21 07:45:00 0 2K
Telangana
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులపై కీలక అప్డేట్..!
హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం...
By Ponnala Srinivasrao 2026-05-07 02:26:48 0 79
Andhra Pradesh
పుంగనూరు ఎద్దుల పరుషలో ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎద్దులు
పుంగనూరులో బుధవారం జరిగిన ఎద్దుల పరుషలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కదిరి నుంచి...
By Kothuru Murali 2026-04-30 11:38:54 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com