యువజన ఉత్సవాల ముగింపులో బహుమతులు ప్రధానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి

0
171

పత్రికా ప్రకటన.

 

గుంటూరు, కేఎల్ యూనివర్సిటీ || 20-12-2025

 

*వివేకానంద ఆశయాలతో యువత ముందుకు సాగాలి.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి* 

 

*యువజన ఉత్సవాల ముగింపులో బహుమతుల ప్రదానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి* 

 

 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ‘యువ కార్యక్రమం’ యువతకు గొప్ప స్ఫూర్తిని అందించిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలోని ఆర్&డి ఆడిటోరియంలో నిర్వహించిన యువజన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర యువ సంకల్ప్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన యువతకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదేనని అన్నారు.

స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఇవి ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరంగా కొనసాగాలని సూచించారు. యువత తమ చేతుల్లో ఉన్న భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకుంటూ, మంచి పనులు చేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు.

రానున్న రోజుల్లో యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో రాజధాని లేక రాష్ట్రం ఎంతో బాధను అనుభవించిందని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని చేపట్టి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు.

గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభివృద్ధికి నిదర్శనమని, రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగనుందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రానికి కంపెనీల రాకతో ఆ లక్ష్యాన్ని తప్పక సాకారం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎస్. భరణి, కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ సాయి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU
  ​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ...
By Bheeshman King 2026-02-03 11:49:44 0 1K
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:33:54 0 160
Andhra Pradesh
డ్రగ్స్కు కు నో చెప్పేలా పిల్లలను తీర్చి ఇద్దాలి సిఐ
నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి...
By Pagadala Venkateswar 2026-01-15 07:49:03 0 190
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని కూటమి నాయకులు CBN జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదిన వేడుకలను...
By Boya Dasthagiri 2026-04-20 15:40:30 0 155
Andhra Pradesh
Ap District Court Results Today Check In Below Subject Link Provided
ఏపీ జిల్లా కోర్టు ఫలితాలు విడుదల    AP District Court Results 2025   స్కిల్...
By SivaNagendra Annapareddy 2025-12-22 19:05:25 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com