యువజన ఉత్సవాల ముగింపులో బహుమతులు ప్రధానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి

0
150

పత్రికా ప్రకటన.

 

గుంటూరు, కేఎల్ యూనివర్సిటీ || 20-12-2025

 

*వివేకానంద ఆశయాలతో యువత ముందుకు సాగాలి.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి* 

 

*యువజన ఉత్సవాల ముగింపులో బహుమతుల ప్రదానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి* 

 

 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ‘యువ కార్యక్రమం’ యువతకు గొప్ప స్ఫూర్తిని అందించిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలోని ఆర్&డి ఆడిటోరియంలో నిర్వహించిన యువజన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర యువ సంకల్ప్ ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన యువతకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదేనని అన్నారు.

స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఇవి ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరంగా కొనసాగాలని సూచించారు. యువత తమ చేతుల్లో ఉన్న భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకుంటూ, మంచి పనులు చేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు.

రానున్న రోజుల్లో యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో రాజధాని లేక రాష్ట్రం ఎంతో బాధను అనుభవించిందని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని చేపట్టి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు.

గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభివృద్ధికి నిదర్శనమని, రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగనుందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రానికి కంపెనీల రాకతో ఆ లక్ష్యాన్ని తప్పక సాకారం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎస్. భరణి, కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ సాయి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు.
      Nara Lokesh: విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్...
By Pagadala Venkateswar 2026-04-02 06:11:16 0 111
Andhra Pradesh
నల్లగుంట్ల గ్రామానికి రూ. 2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన- అభివృద్ధి దిశకు మరో ముందడుగు!
నల్లగుంట్ల గ్రామానికి రూ.2 కోట్ల తారు రోడ్డు పనులకు శంకుస్థాపన – అభివృద్ధి దిశగా మరో ...
By Chennaiah Kati 2026-02-11 11:35:08 0 237
Andhra Pradesh
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
బ్రేకింగ్... నూజివీడు...   నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..   ...
By Rajini Kumari 2025-12-29 08:46:14 0 141
Andhra Pradesh
పూనూరు నియోజకవర్గం :సదుం పోలీస్ స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి
పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషను డీఎస్పీ మహేంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి,...
By Kothuru Murali 2026-02-05 03:33:01 0 124
Andhra Pradesh
ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
ఆదోని లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు...
By Boya Dasthagiri 2026-05-23 07:53:43 0 44
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com