జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|

0
103

హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో.

వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి కబురు.

టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటన.

జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. 

శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో మంత్రి ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే పది రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామని మంత్రి పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన చిక్కుల వల్ల కొంత ఆలస్యమైందని అయితే వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరపున తీపి కబురు అందిస్తామని ప్రకటించారు.

 జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు.

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘం నాయకులను, సభ్యులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Sidhumaroju   Accreditation cards go

Search
Categories
Read More
Andhra Pradesh
రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
కర్నూలు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) తెలంగాణ రాష్ట్రం రామగుండం,...
By Hari Krishna 2025-12-23 04:33:52 0 91
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 2K
Andhra Pradesh
జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ వార్షికోత్సవాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు
*హైదరాబాద్*   • జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాలను...
By Rajini Kumari 2025-12-28 10:17:21 0 80
Telangana
₹18 లక్షల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సబిత అనిల్ కిషోర్ గౌడ్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ లోని కనాజిగూడ శ్రీనివాస కాలనీలో స్థానిక...
By Sidhu Maroju 2026-02-08 13:39:35 0 59
Andhra Pradesh
సుపరిపాలిన దినోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి సీఎం చంద్రబాబు స్వాగతం
*Photos :-* సుపరిపాలన దినోత్సవంలో పాల్గొనేందుకు అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్...
By Rajini Kumari 2025-12-25 07:47:54 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com