జిల్లా కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు

0
178

పత్రికా ప్రకటన 

 

*జిల్లా కలెక్టర్ కు గవర్నర్ ప్రశంసలు*

 

*రాష్ట్రంలోనే సాయుధ దళాల పతాక నిధుల సేకరణలో గుంటూరు ప్రథమ స్థానం 

 

*జిల్లాలో రూ.17,67,363 సేకరణ

 

గుంటూరు, డిసెంబరు 19 : సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుండి రూ.17,67,363 సాయుధ దళాల పతాక నిధికి సేకరణ జరిగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి. ఈ మేరకు శుక్రవారం లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిల్లా కలెక్టర్ కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. 

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ దళాల పతాక నిధి సేకరణలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని చెప్పారు. సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. ప్రజలు అందరూ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నామని అందుకు కారణం సైనికుల త్యాగాలు అన్నారు. సైనికులు కుటుంబాలను వదిలి పెట్టీ దేశ సరిహద్దుల్లో సియాచిన్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం రక్షణగా నిలిచి దేశాన్ని రేయింబవళ్ళు కాపాడుతున్నారని చెప్పారు. 

దేశ రక్షణలో అసువులు బాసిన వీరజవానులు, వారి పై ఆధార పడిన వారి సంక్షేమం, మాజీ సైనికులు, మాజీ సైనికుల వితంతువుల సంక్షేమంకు సహాయం అందించడం మన కర్తవ్యం అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్ లు, 

జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:33:54 0 112
Telangana
మొయినాబాద్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు వేడుకలు
హిమాయతనగర్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ ఊరేగింపు లో కౌన్సిలర్లు పల్లగోల్ల...
By Veeresh Kumar 2026-03-27 15:05:14 0 262
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల లో గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు,...
By Kothuru Murali 2026-02-26 12:53:13 0 99
Bihar
Prashant Kishor Challenges Rahul Gandhi to Spend a Night in Bihar Village
Patna: Jan Suraaj leader Prashant Kishor has targeted Congress MP Rahul Gandhi, challenging him...
By Bharat Aawaz 2025-06-27 09:54:45 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com