జిల్లా కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు

0
213

పత్రికా ప్రకటన 

 

*జిల్లా కలెక్టర్ కు గవర్నర్ ప్రశంసలు*

 

*రాష్ట్రంలోనే సాయుధ దళాల పతాక నిధుల సేకరణలో గుంటూరు ప్రథమ స్థానం 

 

*జిల్లాలో రూ.17,67,363 సేకరణ

 

గుంటూరు, డిసెంబరు 19 : సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా నుండి రూ.17,67,363 సాయుధ దళాల పతాక నిధికి సేకరణ జరిగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి. ఈ మేరకు శుక్రవారం లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిల్లా కలెక్టర్ కు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. 

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ దళాల పతాక నిధి సేకరణలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని చెప్పారు. సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు. ప్రజలు అందరూ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నామని అందుకు కారణం సైనికుల త్యాగాలు అన్నారు. సైనికులు కుటుంబాలను వదిలి పెట్టీ దేశ సరిహద్దుల్లో సియాచిన్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం రక్షణగా నిలిచి దేశాన్ని రేయింబవళ్ళు కాపాడుతున్నారని చెప్పారు. 

దేశ రక్షణలో అసువులు బాసిన వీరజవానులు, వారి పై ఆధార పడిన వారి సంక్షేమం, మాజీ సైనికులు, మాజీ సైనికుల వితంతువుల సంక్షేమంకు సహాయం అందించడం మన కర్తవ్యం అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్ లు, 

జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిపై పోలీసుల హింస – మానవ హక్కుల సంఘం విచారణ
హైదరాబాద్‌ - హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలో పెట్టి...
By BMA ADMIN 2025-08-11 11:07:45 0 2K
Telangana
గెజిటెడ్ సంతకం కోసం లంచం డిమాండ్
వెయ్యి తీసుకుని.. మిగతా రూ.4 వేల కోసం హెచ్ఎం వేధింపులు!           ...
By Bheeshman King 2026-07-08 12:57:44 0 344
Telangana
కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు.. ఆదివారం వన్‌వే ట్రయల్.|
హైదరాబాద్ : నగర ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు...
By Sidhu Maroju 2026-04-03 18:24:01 0 241
Andhra Pradesh
గుండెపోటుతో జనసేన పార్టీ నాయకులు వరుపుల తమ్మయ్యబాబు మృతి...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో...
By BABJI DADALA 2026-01-05 12:39:46 0 389
Punjab
Punjab’s Irrigation Milestone: Canal Water Usage Soars
The Punjab government has achieved a significant milestone in its commitment to sustainable...
By Lokeshwari Panthadi 2026-06-29 08:53:27 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com