డిసెంబర్ 21వ తేదీన పోలియో డేను విజయవంతం చేద్దాం

0
228

*' డిసెంబర్ 21' పోలియో డేను విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యేలు వెనిగండ్ల,వర్ల*

 

*పోలియో డే ప్రచార పోస్టర్లు ఆవిష్కరించిన...ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వరల కుమార్ రాజా*

 

*అవగాహన లేమితో చేసే చిన్న పొరపాటు.... పసిపిల్లల జీవితానికి శాపం కావొద్దు: ఎమ్మెల్యేలు*

 

*100% చిన్నారులకు చుక్కలు వేయించి.... పోలియోపై మరోసారి విజయం సాధిద్దాం: ఎమ్మెల్యేలు*

 

గుడివాడ డిసెంబర్ 18: ఈనెల 21వ తేదీన జరిగే పోలియో డేను అందరం కలిసి విజయవంతం చేద్దామని గుడివాడ పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అవగాహన లేమితో చేసే చిన్న పొరపాట్లు పసి పిల్లల జీవితానికి శాపం కాకూడదని ఎమ్మెల్యేలు అన్నారు.

 

గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో.... పోలియో డే ప్రచార పోస్టర్లను ఎమ్మెల్యేలు రాము, కుమార్ రాజా ఆవిష్కరించారు. పోలియో డే విజయ వంతానికి చేస్తున్న ఏర్పాట్లను వైద్య అధికారులు ఎమ్మెల్యేలకు వివరించారు.

 

అనంతరం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము,వర్ల కుమార్ రాజాలు మీడియాతో మాట్లాడారు..... గుడివాడ, పామర్రు నియోజకవర్గాల ప్రజలందరూ పోలియో డే సందర్భంగా ఈనెల 21వ తేదీన తమ సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పోలియో బూత్ లలో ఐదేళ్ల లోపు చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని విజ్ఞప్తి చేశారు.

 

పోలియోపై నిరంతర విజయం పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పోలియో డే కార్యక్రమాలను మనందరం కలిసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. అధికారులతో పాటుగా, కూటమి శ్రేణులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించి చిన్నారులు పోలియో చుక్కలు వేయించుకునేలా కృషి చేయాలన్నారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్,మెడికల్ ఆఫీసర్ సురేష్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టిడిపి నాయకులు చాట్ల రమేష్, మున్సిపల్ ఎంఈ ప్రసాద్, డాక్టర్ శ్వేత,ఎంవి ప్రసాద్,రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వై.నాగేశ్వరరావు, కార్యదర్శి కిరణ్ బాబు,ఏఎన్ఎం, ఆశ వర్కర్స్, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మల్కాజిగిరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమీక్ష
 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :    మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-04 11:34:15 0 390
Andhra Pradesh
Nara Lokesh: ఈ సాయంత్రం 6 గంటలకు ఒక ముఖ్య ప్రకటన ఉంటుంది: మంత్రి నారా లోకేశ్ నుంచి ఇంట్రెస్టింగ్ ట్వీట్.
Andhra Nara Lokesh Announces Major Announcement Today at 6 PM కాకినాడలో భారీ ప్రాజెక్టు ఏపీ...
By Pagadala Venkateswar 2026-01-17 11:07:37 0 184
Andhra Pradesh
తాడేపల్లి లోనిYSR కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడుదల రజిని
19.12.2025 తాడేప‌ల్లి   - చంద్ర‌బాబు మార్క్ దోపిడీకి మెడిక‌ల్ కాలేజీల...
By Rajini Kumari 2025-12-20 14:16:57 0 211
Business & Finance
విశాఖ ఉత్సవం–2026 ఏర్పాట్లు వేగవంతం
విశాఖ ఉత్సవం–2026 నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. బీచ్...
By Navya Sree 2026-07-03 08:05:09 0 44
Andhra Pradesh
మే 9న మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్ర.
మదనపల్లెలో మే 9న హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ చైతన్య వేదిక నేతలు బాలాజీ, మధు...
By Pagadala Venkateswar 2026-04-11 06:23:29 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com