మైనార్టీ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే.|

0
245

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ కార్యదర్శి  షఫీఉల్లా (IFS) గారిని మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని మైనార్టీ ముస్లిం, క్రైస్తవ సముదాయాల ప్రజలకు స్మశాన వాటిక కోసం తగిన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే  వినతి పత్రాన్ని సమర్పించారు.

 నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, స్మశాన వాటిక కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించడం అత్యవసరమని ఆయన వివరించారు.

దీనిపై కార్యదర్శి శ్రీ షఫీఉల్లా  సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశం ద్వారా మైనార్టీ వర్గాల మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి ముందడుగు పడిందని ఎమ్మెల్యే  తెలిపారు.

Sidhumaroju   

Search
Categories
Read More
Telangana
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి ...
By Sidhu Maroju 2025-08-31 17:44:56 0 380
Andhra Pradesh
శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం
మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది....
By Kothuru Murali 2026-01-12 13:55:59 0 182
Telangana
కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్!
కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్! ఫిబ్రవరి రెండవ వారంలో సెలవులను పురస్కరించుకుని,...
By Pinnehasan Odela 2026-02-04 07:46:06 0 384
Telangana
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్  ప్రసాద్...
By Sidhu Maroju 2026-06-23 08:25:58 0 88
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు,...
By Kothuru Murali 2026-02-22 13:09:23 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com