పి పి పి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు

0
120

*పత్రికా ప్రకటన*

 

అమరావతి,

16.12.25.

 

• *పిపిపి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు : రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి*

 

• *వైద్య విద్య ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో.. ఎక్కువ మందికి మెడికల్ విద్య అందించాలంటే పీపీపీ విధానం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసిన కేంద్రం*

 

• *పీపీపీ విధానంలో ఒక్కో మెడికల్ కాలేజీలో 250 యూజీ సీట్లు పెంచుకునే వెసులుబాటు ఉందని తన నివేదికలో స్పష్టం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ* 

 

• *రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మెడికల్ కాలేజీలపై వైసీపీ విమర్శలు* 

 

• *కేవలం తమ రాజకీయ ఉనికి కోసమే ప్రజలను రెచ్చగొట్టి నిరసనలు, ఉద్యమాలు పేరిట ఊదరగొడుతున్నారు..*

 

• *కోటి సంతకాల సేకరణ నాటకమంతా ఒక బూటకం*

 

• *పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై హైకోర్టు సమర్థించినా ప్రతిపక్ష నేతల్లో మార్పు కనిపించకపోవడం దురదృష్టం..*

 

 

• *నిధుల కొరతతో సుధీర్ఘ కాలం పాటు నిర్మాణాలు కొనసాగే దుస్థితికి.. చరమగీతం పాడాలనే చంద్రబాబు నేతృత్వంలో పీపీపీపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం..*

 

• *పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి.. ప్రవేటీకరణకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకుండా ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోంది..*

 

• *పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఎక్కడైనా చర్చకు కూటమి ప్రభుత్వం సిద్ధం*

 

• *పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేపట్టడం ద్వారా వైద్య విద్య మెరుగుపడటంతో, నిరుపేదలకు మెరుగైన వైద్యం సాయం అందించగలం*

 

• *పీపీపీ విధానంలో అదనంగా 220 సీట్లు రాష్ట్రంలో పెరగడంతో పాటు, 110 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలో పెరుగుతాయి..*

 

• *వైసీపీ పాలనలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ. 8400 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. కేవలం రూ. 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నారు*

 

• *మెడికల్ కాలేజీ నిర్మాణాలకు సంబంధించిన నిధులు నాడు పక్కదోవ పట్టించి, నేడు రాజకీయ విమర్శలకు పాల్పడటం దుర్మార్గం..*

 

• *151 సీట్లతో ప్రజలు అధికారం కట్టబెడితే, 17 మెడికల్ కాలేజీలు నిర్మించలేని, మీరు నేడు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు..*

 

• *రాబోయే రెండేళ్లలో కాలేజీ నిర్మాణాలు పూర్తి చేసి, రాష్ట్ర విద్యార్ధులకు అదనంగా 1750 సీట్లు పొందేందుకు వెసులుబాటు కల్పిస్తాం.*

 

• *పీపీపీ విధానంలో ప్రభుత్వమే వైద్య కళాశాలలు & ఆసుపత్రుల యాజమాన్యాన్ని కొనసాగిస్తుంది.. ప్రవేట్ భాగస్వామి కేవలం మౌలిక సదుపాయాల కల్పన & నిర్వహణలో సహాయం అందిస్తుంది.*

 

• *గత ఐదేళ్ల మీ అరాచక, అసమర్థ, అవినీతి, అర్ధరహిత పాలనకు.. నాడు మీ హాయాంలో అసంపూర్తిగా వదిలేసిన మెడికల్ కాలేజీల మొండి గోడలే సజీవ సాక్ష్యం.*

 

• *5 ఏళ్ల పాలనలో 5 మెడికల్ కాలేజీలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయని జగన్ మోహన్ రెడ్డి అండ్ కో మాట్లాడటం విడ్డూరం*

 

• *ఐదేళ్లు సీఎం పదవిని వెలగబెట్టి.. మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయలేని అసమర్థ నేత జగన్*

 

• *సామాన్య ప్రజల విషయం పక్కన పెడితే, మీరు చేస్తున్న నిరసనలకు కనీసం వైసీపీ కార్యకర్తల నుంచి కూడా స్పందన కరువైంది..*

 

• *ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తప్పులుంటే ప్రజా ఉద్యమాలు చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం బాధ్యత గల ప్రతిపక్షంపై ఉంటుంది*

 

• *అది మరిచి కేవలం మొక్కుబడిగా కోటి సంతకాలు అంటూ డ్రామాలాడుతూ, ప్రజలను పక్కదోవ పట్టించడం మీ రాజకీయ చిత్తశుద్ధికి నిదర్శనం*

 

• *చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం.. నేడు అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ, దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోంది..*

 

• *రాష్ట్రంలో సంక్షేమ – అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్న తీరు జీర్ణించుకోలేని వైసీపీ.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే కుటిల బుద్ధితో, ఇటువంటి పన్నాగాలకు పాల్పడుతోంది...*

 

• *విచ్చలవిడిగా అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ ను అప్పుల కుప్పగా వైసీపీ మార్చేసింది*

 

• *ఆర్ధికంగా రాష్ట్రాన్ని దివాళా తీయించే పరిస్థితికి తీసుకొచ్చిన వైసీపీ నేతలు.. నేడు అప్పులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం*

Search
Categories
Read More
Telangana
మరోసారి భగ్గుమన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ మరో సారి భగ్గుమంది.. 2024 జూలై , ఆగస్టు లో జరిగినఅలర్లలో షేక్ హసీనా ప్రభుత్వని...
By Yadamma Raju Gajapaga 2025-12-23 20:54:29 0 292
Andhra Pradesh
రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన...
By Pagadala Venkateswar 2026-02-03 12:39:05 0 28
Telangana
రూ. 2.23 కోట్ల వ్యయంతో అల్వాల్ రూపు రేఖలు మార్చేస్తాం : అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ పరిధిలోని ప్రజల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపే...
By Sidhu Maroju 2026-02-10 15:27:18 0 50
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:22:51 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com