రహదారుల రూపకల్పనకు నిర్మాణాత్మకమైన కృషి. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

0
346

బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు సూచన మేరకు ప్రధాన రహదారులకు నిధులు కేటాయించారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామం నుండి తుమ్మలపల్లి వయా పెర్లమ్మ ఆలయ వరకు రహదారి నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న ఆందోళన పై స్పందించిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు చేసిన కృషి ఫలితంగా ఒక చక్కటి రహదారికి మార్గం సుగమం అయింది. బాపట్ల మండలం పూండ్ల రహదారి నుండి మర్రిపూడి మాలపల్లి వరకు 81 ఒక్క లక్షల రూపాయలతో రహదారి నిర్మించనున్నారు. నిధులను మంజూరు చేయటంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో అనేక రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గుర్తు చేశారు. తిరిగి మరో రెండు రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి అమలుకు నోచుకొని రహదారులకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకొని అందమైన రహదారులకు రూపకల్పన చేస్తామని చెప్పారు. మరికొన్ని రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేసి ఉన్నామని వెల్లడించారు. త్వరలోనే ఆయా నిధులు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెప్పారు. గుంతలు లేని రహదారులు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో అనేక రహదారుల పరిస్థితిపై నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రహదారులను కలిపే అనుసంధాన రోడ్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు వెల్లడించారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు విడుదల
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా రోజుల తర్వాత విడుదలయ్యాయి. ఈ చెక్కులు రామగుండం మేయర్...
By Sunka Santhosh 2026-06-03 18:44:42 0 107
Telangana
ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టు
n  నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు n  గిరిజన విద్యార్థినులకు శక్తి...
By Bheeshman King 2026-04-11 05:06:26 0 2K
Telangana
ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు
మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల...
By Bheeshman King 2026-02-03 13:57:12 0 367
SURAKSHA
M. G. Rajamanickam IAS: Transforming Governance with Vision
The Journey Begins Among Kerala's accomplished civil servants, M. G....
By Fathima Safa 2026-07-14 11:35:56 0 134
Telangana
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో ఏటీఎం...
By Pinnehasan Odela 2026-04-01 07:14:57 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com