విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజా దర్బార్

0
185

*Press Release*

 

*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*

 

*ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ*

 

విశాఖపట్నం: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన తనకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలని లంకిరెడ్డి సతీశ్వరరెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, విచారించి తగిన న్యాయం చేయాలని గాలి దుర్గమ్మ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. 2008లో వీసీఐసీ ఫేజ్-1లో భాగంగా పరిశ్రమల అభివృద్ధి కోసం ఏపీఐఐసీ భూసేకరణ చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పునరావాసం కల్పించలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో విశాఖ ఏపీహెచ్ బీ లే అవుట్ లోని తమ 70వ నెంబర్ ఫ్లాట్ ను ఆక్రమించారని, విచారించి న్యాయం చేయాలని ఎస్.వెంకట లావణ్య కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

*****

Search
Categories
Read More
SURAKSHA
Maharashtra Police Host Annual Mega State Sports Meet
To foster an exceptionally agile and resilient force, the Maharashtra Police department places a...
By Lokeshwari Panthadi 2026-07-04 07:48:13 0 52
Rajasthan
Suspected Drone Found Near Indo-Pak Border in Rajasthan's Sri Ganganagar, Triggers Security Alert
Suspected Drone Found Near Indo-Pak Border in Rajasthan's Sri Ganganagar, Triggers Security Alert...
By BMA ADMIN 2025-05-20 06:59:27 0 2K
Andhra Pradesh
మదనపల్లెలో పగటి వేళ భారీ వాహనాలకు నో ఎంట్రీ.
మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి...
By Pagadala Venkateswar 2026-01-23 06:19:45 0 167
Telangana
కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర...
By Jagadeesh Babu 2026-05-27 14:27:29 0 293
Maharashtra
Maharashtra Urges Caution in Sowing Amid Rainfall Gaps
The Maharashtra government has advised farmers to carefully plan their sowing activities due to...
By Navya Sree 2026-06-26 06:33:39 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com