కూకట్పల్లిలో 62 మంది నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ

0
286

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే కలుషితరహిత త్రాగునీరు, మెరుగైన రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను 62 మంది నిరుపేద లబ్ధిదారులకు కేటాయిస్తూ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, ఒక ఇంటిలో పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమం కైతలాపూర్ లో జరిగింది.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో పట్టాల పంపిణీ చేపట్టారు.

కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తో పాటు ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కలెక్టర్ మనో చౌదరి, జోనల్ కమిషనర్, ఎమ్మార్వో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   నిరుపేదలకు గృహ వసతి కల్పించడం, మహిళల ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్రోల్ బంకుల కేటాయింపు, మహిళా సంఘాలకు బస్సుల అందజేత వంటి పథకాల ద్వారా మహిళల సాధికారతకు కృషి చేస్తోందన్నారు. అలాగే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

  కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ కూకట్‌పల్లి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో నిరుపేదలు ఉన్నారని, వారికి మరిన్ని నిధులు కేటాయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని విస్తరించాలని మంత్రిని కోరారు.

Search
Categories
Read More
Telangana
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy 
By Sunka Santhosh 2026-03-23 11:02:46 0 295
Andhra Pradesh
స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం. మేకింగ్ ఇండియాకి మద్దతు ఇద్దాం
పత్రికా ప్రకటన విజయవాడ    *• స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం మేకిన్ ఇండియాకి...
By Rajini Kumari 2026-01-04 11:08:14 0 191
Telangana
CSB బ్యాంక్ నూతనశాఖ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి లో CSB బ్యాంకు నూతన శాఖను బ్యాంకు...
By Sidhu Maroju 2026-01-05 07:25:38 0 196
Uttarkhand
IMD Issues Rain Watch for Uttarakhand Amid Monsoon
The India Meteorological Department (IMD) has placed Uttarakhand under a rain watch as monsoon...
By Navya Sree 2026-06-27 06:06:33 0 75
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ జాతరలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
ఈరోజు గంగమ్మ జాతరలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు...
By Benguluri Madhubabu 2026-02-19 08:36:41 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com