అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏకే భాష గారు

0
134

ది.15-12-2025 న అమరి జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ది బెజవాడ బార్ అసోసియేషన్ లో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎ కె బాష గారు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి 58 రోజులపటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆయన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని మద్రాసులో మన తెలుగు వారు పడుతున్న కష్టాలను చూసి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విడదీయాలని ఉద్యమాన్ని చేపట్టి మన తెలుగువారి కోసం ఆయన సుఖ సంతోషాలను వ్యక్తిగత ఆశలను పక్కన పెట్టి తెలుగుజాతి గౌరవం కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారు అని, 1952 లో ఆయన చేసిన దీక్ష భారత దేశ చరిత్రను మార్చిందని ఆయన త్యాగ ఫలితంగానే 19503 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని ఉపన్యసించారు. ఈ కార్యక్రమానికి గవర్నింగ్ బాడీ సీనియర్ జూనియర్ న్యాయవాదుల హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ గురునానక్ దేవ్ జీ 556 వ జయంతి : పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని గురుద్వార సంగత్ సాహిబ్ సభ, గురు నానక్...
By Sidhu Maroju 2025-11-02 16:43:41 0 194
Andhra Pradesh
ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ
విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల...
By Mobbu Venkatramana 2026-02-27 15:32:02 0 256
Andhra Pradesh
విద్యార్థులకు శక్తి టీం అవగాహన సదస్సు
చీరాల పట్టణంలో దర్బార్ రోడ్డు లోని ఐస్ మ్యాజిక్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:44:24 0 319
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com