పదో తరగతి నుండి ఇంటర్ వరకు ఒకటే బోర్డు

0
58

తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పదో తరగతి (SSC) నుండి ఇంటర్మీడియట్ (Intermediate) వరకు ఒకే బోర్డు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది.

పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, విద్యార్థులకు నిరంతర, సమగ్ర విద్యావిధానాన్ని (Seamless Education System) అందించడం. ప్రస్తుతం ఉన్న బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (SSC బోర్డు) మరియు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE) రెండింటినీ కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీబీఎస్‌ఈ (CBSE) విద్యావిధానం తరహాలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు మరింత సులువుగా సన్నద్ధం కావడానికి వీలు కలుగుతుంది.కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డుకు సంబంధించిన పేరు, దాని విధివిధానాలపై త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

ఈ విద్యా సంస్కరణలు వచ్చే విద్యా సంవత్సరం (2026) నుండి అమలులోకి రావడానికి సంబంధించిన  విధివిధానాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది |

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com