ఆటోలు మర్చిపోయిన బంగారాన్ని గంటల వ్యవధిలోనే బాధితులకు అందజేసిన పోలీసులు.|

0
174

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శనివారం నాడు, ఆంధ్ర లోని విజయవాడ నుంచి బొల్లారం తుర్కపల్లి కి గృహప్రవేశం నిమిత్తం వచ్చిన షేక్ సన, తిరుగు ప్రయాణం చేద్దామని ట్రైన్ కోసం సఫీల్ గూడ వెళ్లారు. అక్కడ వారికి ట్రైన్ మిస్ అవ్వడంతో  బొల్లారం తుర్కపల్లి కి ఆటోలో తిరుగుప్రయాణం అయ్యారు.

వారు తీసుకువెళ్లిన అన్ని లగేజ్ బ్యాగులు ఇంట్లోకి తెచ్చుకున్నారు కానీ ఒక లగేజ్ బ్యాగు అందులో 18 తులాల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న  బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు.

ఆదివారం నాడు బ్యాగులు చెక్ చేయగా అందులో ఒక బ్యాగ్ మిస్ అయిందని అందులోనే బంగారు నగలు ఉన్నాయని గమనించి వెంటనే  ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కి ఆదివారం మధ్యాహ్నం వచ్చి పోలీసులను ఆశ్రయించగా, అక్కడ విధుల్లో వున్న ఎస్సై చంద్రశేఖర్  సానుకూలంగా స్పందించి, ఎస్.హెచ్.ఓ అల్వాల్, మరియు డీఐ తిమ్మప్ప ఆదేశాలను అనుసరిస్తూ అట్టి ఆటోను మూడు గంటల వ్యవధిలోని ట్రేస్ చేసి అల్వాల్ పోలీస్ స్టేషన్ కు రప్పించారు.

బాధితురాలుకు సంబంధించిన బ్యాగును మరియు అందులో ఉన్న 18 తులాల విలువైన బంగారు నగలను సదరు బాధితురాలికి అప్పగించారు.

ఆటోలో మర్చిపోయిన అట్టి బ్యాగును,  బంగారు నగలను సదరు ఆటో డ్రైవర్ రాజేష్ బాధ్యతతో తిరిగి తెచ్చినందుకు అభినందనలు తెలియజేశారు. 

అలాగే, ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలని ఎస్సై చంద్రశేఖర్  సదురు మహిళలకు సూచించారు. తమకు సత్వరన్యాయం అందించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలియచేసారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల పరిసర ప్రాంతాల పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన … ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న సెల్‌ఫోన్ వినియోగం
చీరాల: చీరాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా...
By Gadiyapudi Narendra 2026-02-12 17:18:31 0 136
Andhra Pradesh
Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్.
    Nara Lokesh: మంగళగిరిలో క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్ 17-01-2026...
By Pagadala Venkateswar 2026-01-17 11:40:12 0 169
Andhra Pradesh
జాతీయ రోలర్ స్కేటింగ్లో విశాఖ అమ్మాయి బంగారు పతకం
విజయవాడ  (17-12-2025)   *స్కేటర్ అమృతకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అభినందనలు* ...
By Rajini Kumari 2025-12-17 09:46:01 0 209
Andhra Pradesh
జిల్లా ఆదాయం పెంపే లక్ష్యం.. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి.
మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-27 04:16:37 0 126
Andhra Pradesh
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
By Kothuru Murali 2026-03-09 08:11:28 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com