లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే.|

0
89

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం నేరుగా ప్రజలకు చేరేలా ఎమ్మెల్యే  ప్రత్యేకంగా పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో చెక్కులు అందుకున్న లబ్ధిదారులు:

బాలాజీ యాదవ్ (అల్వాల్ డివిజన్) – రూ. 37,500

నవీన్ రాజు (అల్వాల్ డివిజన్) – రూ. 13,500

వాణి (వినాయక్ నగర్ డివిజన్) – రూ. 11,500

షేక్ జిలాని (మచ్చ బొల్లారం డివిజన్) – రూ. 21,000

ఎమ్మెల్యే  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సాయం ఎంతో మందికి ఆశగా నిలుస్తోందని తెలిపారు. మరింత మంది లబ్ధిదారులకు కూడా ఈ సహాయం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమం లో  కార్పొరేటర్ శ్రీమతి చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, బద్దం పరశురాం రెడ్డి, నాయకులు డోలి రమేష్,  తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Bharat Aawaz
Building The Future Together!
Building The Future Together! BMA not just an Association—it’s a...
By Bharat Aawaz 2025-07-05 05:30:11 0 1K
Andhra Pradesh
కశింకోట అంతర్-మండల మోటార్ల దొంగల ముఠా అరెస్ట్: 8 మోటార్లు, బైక్ స్వాధీనం
 *కశింకోటలో వరుస చోరీలకు చెక్ పెట్టిన ప్రత్యేక బృందం* కశింకోట: మండల పరిధిలోని పలు...
By Bhesetti Lovaraju 2026-02-04 13:17:11 0 96
Telangana
స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్
విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేయడంతో పాటు...
By Krishna Balina 2026-01-24 14:40:50 0 202
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com