బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
159

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ పరిశీలనకు వెళ్లి మార్కెట్ మొత్తం కలియతిరిగి రైతులు, వ్యాపారులు,హమాలీలతో  మాట్లాడారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు,వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు.రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మరియు మౌలిక వసతులైన ఉపయోగం లేని టాయిలెట్లను తొలగించి నూతనంగా నిర్మించాలని, మార్కెట్లో రహదారులు పాడై పోయినందున రహదారులను అభివృద్ధి చేయాలని, మార్కెట్ ను ప్రతిరోజు క్లీనింగ్ చేపించాలని, ఓపెన్ డ్రైనేజీని శుభ్రం చేసి దోమల బారి నుంచి కాపాడాలని కోరారు.

 వ్యాపారులు కూడా లైసెన్సుల విషయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఛైర్మన్, సెక్రటరీ ,కమిటీ సభ్యులు, కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశమై మార్కెట్ లో నెలకొన్న సమస్యలపై చర్చించి రాష్ట్రంలోనే అతి పెద్దదైన బోయిన్ పల్లి మార్కెట్ లో మెరుగైన మౌలిక వసతులను కల్పిద్దామని, మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మార్కెట్ ను అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చిందని కావున మార్కెట్ సమస్యలను అవసరమైతే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళదామని, మార్కెట్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. మార్కెట్ పరిశీలనలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, సెక్రటరీ వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రోంగళి జగన్నాథరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీనుని మర్యాదపూర్వక కలయక.
విజయనగరం 24 మార్చి 2026: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు బొబ్బిలి...
By Yalakala Vasunaidu 2026-03-24 08:50:34 0 222
Andhra Pradesh
జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్ నందిగామ,ఏప్రిల్,20,(భారత్...
By Patan Khuddus 2026-04-21 06:51:01 0 240
Andhra Pradesh
జిల్లాలు డివిజన్లు మండలాలు పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష
*For Scrolls*   *అమరావతి*   *జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు,...
By Rajini Kumari 2025-12-27 10:43:30 0 179
Telangana
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా      కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి...
By Nookapangu Manikanta 2026-04-11 02:47:26 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com