సామాన్య ప్రజలకు హక్కులు అందించిన మన రాజ్యాంగం- ప్రొఫెసర్ కోదండరాం.|

0
151

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశ సామాన్య ప్రజలకు హక్కులు అందించినది మన రాజ్యాంగమని మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ తెలిపారు.

బుధవారం రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓల్డ్ ఆల్వాల్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

సమావేశానికి ముందు ఓల్డ్ అల్వాల్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా,  కోదండరాం మాట్లాడుతూ..  స్వతంత్రానికి ముందు కొందరికే హక్కులు అధికారాలు ఉన్నాయని అని చెప్పారు. స్వాతంత్రం తరువాత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి దేశ పౌరులందరికీ సమాన అవకాశాలు వచ్చాయని వివరించారు.

భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రిటైర్డ్ ఐడిఏఎస్ అధికారి కె ఎస్ ఎన్ మూర్తి తెలిపారు. రాజ్యాంగ రక్షణ గురించి హక్కుల గురించి వివరించారు. 

విద్యా విధానంలో ఎప్పుడు ముందుండడానికి ప్రతి విద్యార్థి కృషి చేయాలని డాక్టర్ సిద్ధూజి తెలిపారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులను చైతన్యవంతం చేయడం కోసం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించామని గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి జీ వి సూర్యకిరణ్ తెలిపారు. అల్వాల్ మండల ఆరు పాఠశాలలో 8. 9.10. తరగతుల విద్యార్థులకు భారత రాజ్యాంగం పౌర హక్కులు అంశం పైన వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తున్నామని అని చెప్పారు. 

ఈ సందర్భంగా మండల స్థాయిలో ముగ్గురు విద్యార్థులకు బహుమతులతో పాటు వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న 54 విద్యార్థులకు బహుమతులను  అందజేశారు.

కార్యక్రమంలో అల్వాల్ మండల విద్యాశాఖ అధికారి టి. మురళీకృష్ణ , పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో నిర్వాహనకు సహకరించిన ప్రతి ఒక్కరికి గద్దర్ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు.
చీరాల: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చీరాల పట్టణంలో శనివారం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి...
By Gadiyapudi Narendra 2026-02-21 16:33:05 0 154
Andhra Pradesh
టీటీడీ ఛైర్మన్ ను తొలగించాలి: మాజీ ఎమ్మెల్యే శంబంగి
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవి నుంచి తొలగించి తిరుమల...
By Boiena Rajesh 2026-04-04 08:28:35 0 144
Telangana
మెదక్ జిల్లాలోని చర్చలలో పిస్ట్ సెలబ్రేషన్స్కు 34 లక్షల మంజూరు... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండగను పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్...
By Gangaram Rangagowni 2025-12-25 02:18:06 0 212
Telangana
భారత్ సంచలన విక్టరీ... ప్రపంచ క్రికెట్ రారాజుగా టీమిండియా
T20 World Cup 2026 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది....
By Yadamma Raju Gajapaga 2026-03-08 17:32:00 0 213
Andhra Pradesh
రాయచోటి లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 5 లక్షల రూపాయలు సహకారం అందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటిలో రెండు అన్నా క్యాంటీన్లో ఉచిత నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరుపున 5...
By Benguluri Madhubabu 2026-02-24 14:51:36 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com