ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
214

 

 

సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో ఉన్న భారీ గుట్ట రాళ్ళు పగుళ్ళు ఏర్పడి ఏ క్షణమైనా పడి పోయేలా ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆ ప్రాంత వాసులతో కలసి ఆ ప్రాంతాన్ని,గుట్ట రాళ్ళను పరిశీలించారు.అక్కడినుండే GHMC అధికారులతో మాట్లాడి తక్షణమే యుద్ధప్రాతిపదికన గుట్ట రాళ్ళను తొలగించి పరిసర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ జరుగకుండా చూడాలని చెప్పారు. స్థానిక ప్రజలకు కూడా ఎమ్మెల్యే ఎటువంటి ఇబ్బంది జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని, ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ధనలక్ష్మి,వెంకట స్వామి, శంకర్ ,ముత్యాలు, రాములు తదితరులు ఉన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మద్దిలేటి స్వామిని దర్శించుకున్న డోన్ ఎమ్మెల్యే!! కోట్ల
కర్నూలు : బేతంచర్ల : RS రంగాపురం : డోన్:  ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని...
By Hari Krishna 2025-12-28 08:58:05 0 154
Andhra Pradesh
జిల్లా కేంద్రాల్లో వాహనాల తనిఖీలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత 7 రోడ్డు కూడళ్లు మరియు ముఖ్యమైన కూడళ్లను ట్రాఫిక్ పోలీసులు...
By Manda Ramkumar 2026-03-27 11:23:13 0 169
Andhra Pradesh
మదనపల్లె: అంజలి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు: డిఎస్పి.
ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు...
By Pagadala Venkateswar 2026-02-21 04:18:07 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com