వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న సూడో పోలీస్ : అరెస్ట్ చేసిన పోలీసులు.|

0
247

సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న మసూద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉత్తర మండల డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు.నాగపూర్ జాతీయ రహదారి పక్కనే వాహనాలను ఆపి తనిఖీ చేస్తూ వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్వాల్ కు చెందిన రంజన్ మాలిక్ అనే వ్యక్తి నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వస్తుండగా అతన్ని ఆపినట్లు తెలిపారు. వాహనంపై చలాన్లు ఉన్నాయని 2 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని డిమాండ్ చేయడంతో 400 రూపాయలు చెల్లించారు.సివిల్ దుస్తులలో ఉన్న వ్యక్తి పోలీసు అని చెప్పడంతో అనుమానం వచ్చి వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిరోజ్ గూడ కు చెందిన మసూద్ ఖాన్ గా గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ పోలీసులని అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని డిసిపి సూచించారు.

#sidhumaroju   

Search
Categories
Read More
Business & Finance
Goa MSME Sector Receives Fresh Growth Support
Goa's micro, small, and medium enterprises (MSMEs) are benefiting from improved access to...
By Navya Sree 2026-07-06 07:55:26 0 114
Andhra Pradesh
ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు.
ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు...
By Pagadala Venkateswar 2026-05-19 05:30:38 0 76
Business & Finance
Foxconn Recalls Staff From India
In a setback to Apple’s India expansion plans, Foxconn Technology Group has been sending...
By Bharat Aawaz 2025-07-03 08:16:40 0 3K
Telangana
"అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యం: అల్వాల్ ఏసీపీ శంకర్ రాజు ప్రత్యేక చొరవ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సురక్షితమైన ప్రయాణం మరియు పచ్చదనం పరిరక్షణే లక్ష్యంగా...
By Sidhu Maroju 2026-04-25 11:28:30 0 437
Business & Finance
Mizoram Peace Milestone Strengthens Investment Climate
Mizoram marked the 40th anniversary of the Mizoram Peace Accord, with leaders recognizing its...
By Navya Sree 2026-07-02 07:22:25 0 46
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com