తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం

0
282

సికింద్రాబాద్ :  సికింద్రాబాద్ లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయిందని అన్నారు . ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న చర్యలను వ్యతిరేకించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయగా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లకు, బిసి కులాలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలని ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించామని ఆ అంశాన్ని సైతం రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. దేశంలోనే మహారాష్ట్రలో రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికల మూలంగా ప్రజలు నష్టపోయారని అన్నారు. రాజ్యాంగానికి,సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జాయింట్ కలెక్టర్.
అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా రాయచోటికి విచ్చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ...
By Pagadala Venkateswar 2026-05-04 05:58:21 0 102
Andhra Pradesh
శశాంక్ కనుమూరికి CM అభినందనలు
*Photo:* రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-25 07:36:58 0 197
Telangana
ప్రతి ఓటూ నమోదు కావాలి SIRలో వేగం పెంచండి.|
"BLAలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీగణేష్.. ఒక్క ఓటూ మిస్ కాకూడదని సూచన" మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా...
By Sidhu Maroju 2026-06-27 10:55:25 0 75
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సదుం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణకు...
By Kothuru Murali 2026-01-27 05:00:11 0 205
Andhra Pradesh
గ్రామ పంచాయతీలకు చెత్త ఆటోలను అందజేసిన రెవెన్యూ అధికారి ఏం లక్ష్మీ నరసింహం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ
*ఎన్టీఆర్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి నుంచి తడి చెత్త - పొడి...
By Rajini Kumari 2025-12-16 07:25:32 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com