తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ కార్యవర్గ సమావేశం

0
236

సికింద్రాబాద్ :  సికింద్రాబాద్ లోని రాయల్ రేవ్ హోటల్ లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయిందని అన్నారు . ఓటు బ్యాంకు రాజకీయం కోసమే తెలంగాణలోని రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న చర్యలను వ్యతిరేకించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో పిటిషన్ వేయగా బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లకు, బిసి కులాలకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలని ఉద్దేశంతోనే కోర్టును ఆశ్రయించామని ఆ అంశాన్ని సైతం రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. దేశంలోనే మహారాష్ట్రలో రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నికల మూలంగా ప్రజలు నష్టపోయారని అన్నారు. రాజ్యాంగానికి,సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని వెల్లడించారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థి భర్తీ చేయాలి గిరిజన ప్రజా సంఘాలు
*నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థినికి భర్తీ చేయాలి - గిరిజన ప్రజా సంఘాల జేఏసీ*  ...
By Rajini Kumari 2026-01-06 11:09:37 0 173
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పరిసర ప్రాంతాలలోకోడి పందెం రాయూళ్లని అరెస్ట్ చేసిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, బోయకొండ పరిసర ప్రాంతంలో రహస్యంగా కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో...
By Kothuru Murali 2026-02-05 12:03:41 0 118
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని...
By Sidhu Maroju 2025-06-08 08:54:09 0 1K
Andhra Pradesh
ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం
హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు  హజ్ కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతా పూర్వక అభినందనలు ప్రతి హజ్...
By Patan Khuddus 2026-04-19 14:54:31 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com