రాజకీయ వ్యభిచారం ఆశయం నుంచి ఆత్మవంచన వరకు...

0
2K

వందల రాజకీయ పార్టీలు. ప్రతి పార్టీ పుట్టుక ఒక ఆశయం కోసమే, విలువల కోసం, కొన్ని సిద్ధాంతాల కోసం. ప్రజాసేవ చేస్తామని, ప్రజల ఆకాంక్షలకు నిలువుటద్దమవుతామని వాగ్దానం చేస్తాయి.

లక్షలాది మంది నాయకులు, ఒక్కొక్కరూ ఒక్కో ఆశయాన్ని నెరవేర్చేందుకు పార్టీలో చేరి, ప్రజల ప్రతినిధులుగా మారతారు. పార్టీ అంటే ఒక వ్యక్తి కాదు, ఆశయాల సమూహం. ఆశయాల చుట్టూ తిరిగే విధులు, విధానాలు, సిద్ధాంతాలతోనే మానిఫెస్టోలు తయారవుతాయి. ప్రజలు తమ జీవితాలను, భవిష్యత్తును ఆశించి వేసిన ఓటు ఆ విలువలకు, ఆ ఆదర్శాలకు వేసిన ఓటు.

మరి, ఇన్ని విలువలు, సిద్ధాంతాలు, ఆశయాలు, విధులు, విధానాలు నిజంగా అందరు రాజకీయ నాయకులు పాటిస్తున్నారా? స్వలాభం కోసం, అధికారం కోసం, పార్టీలను, తమను ఎన్నుకున్న ప్రజలను వంచించి 'రాజకీయ వ్యభిచారం' చేయడం సబబేనా?

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి పట్టిన దుస్థితి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ నిస్సహాయత.

ఓటు వేసి గెలిపించిన ప్రజలను నాయకులు తమ సొంత లాభాల కోసం అమ్ముకున్నప్పుడు, అది కేవలం రాజకీయ బదిలీ కాదు. అది మన కలలకు, మన భవిష్యత్తుకు చేసిన మోసం.‘ఇది రాజకీయ వ్యభిచారం’.

దీనిని అడ్డుకోవడానికి మన దేశంలో 'పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం' ఉంది. ఒక నాయకుడు ఎన్నికల తర్వాత తన పార్టీని వీడితే, అతడి పదవిని రద్దు చేసే అధికారం ఈ చట్టానికి ఉంది. కానీ, ఈ చట్టం పూర్తి విజయం సాధించిందా అంటే? లేదు అని చెప్పాలి. ఎందుకంటే, రాజకీయ వ్యభిచారం ఇప్పుడు 'బహుమతి'గా మారింది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడానికి లంచంగా కోట్లు ఇస్తున్నారు, లేదా పదవిని ఆశిస్తున్నారు. ఒకరిద్దరు నాయకులు మారితే చట్టం శిక్షిస్తుంది, కానీ ఒక గ్రూపుగా మారితే? ఆ పార్టీని మరొక పార్టీలో విలీనం చేస్తే? చట్టం ఒక మూగ సాక్షిగా నిలబడుతుంది. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే మౌనంగా ఉంటూ రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంటే, ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ మిగిలింది?

ప్రజాస్వామ్యం ఒక పాలకుల వ్యవస్థ కాదు. అది ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలే నిర్మించుకున్న వ్యవస్థ. వ్యవస్థకు పట్టిన ఈ చీడను తొలగించాల్సిన బాధ్యత మనదే. మన ఓటు ఒక వ్యక్తికి ఇచ్చిన అధికారం కాదు, అది మన ఆశలకు ఒక అవకాశం. ఆ అవకాశం దుర్వినియోగం అయినప్పుడు మనం ప్రశ్నించాలి.

ఇకపై కేవలం ఓటు వేసి మౌనంగా ఉండే శిలలు కాదు, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, మన నాయకులను నిలదీసే శక్తివంతులం అవుదాం. మన ఆత్మగౌరవాన్ని, దేశ గౌరవాన్ని కాపాడడానికి మనం ఒకరితో ఒకరు నిలబడి పోరాడాలి. మార్పు బయట నుంచి రాదు. అది మనలో నుంచే మొదలవ్వాలి.

రైట్ టు రీకాల్: ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం. ఈ రాజకీయ వ్యభిచారాన్ని సమూలంగా పెకిలించడానికి మనకు కావాల్సింది ఒక శక్తివంతమైన ఆయుధం. అదే ‘రైట్ టు రీకాల్’ లేదా ‘తిరిగి పిలిపించుకునే హక్కు’. ఒకసారి ఆలోచించండి, ఇది ఒక చట్టం మాత్రమే కాదు, ఇది మన ప్రజాస్వామ్యానికి 'రిమోట్ కంట్రోల్'. మనం ఎన్నుకున్న నాయకుడు సరిగ్గా పనిచేయకపోతే, అవినీతికి పాల్పడితే, లేదా మన నమ్మకాన్ని దగా చేస్తే... మనం అతడిని తిరిగి పిలిచి, తన పదవి నుంచి తొలగించే హక్కు మనకు ఉండాలి.

ఈ హక్కు వచ్చినప్పుడు, ప్రతి నాయకుడూ ప్రజలకు జవాబుదారీగా ఉంటాడు. లంచాలకు భయపడి పక్కకు తప్పుకోడు, తనని ఎన్నుకున్న ప్రజల ఆశలను మోసం చేయడానికి భయపడతాడు. రైట్ టు రీకాల్ అనేది ఒక గ్యారంటీ. మనం వేసే ఓటుకు భద్రత.

మనం మన ఓటును అమ్మకోకుండా కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, మన నాయకుడు మన ఓటును అమ్ముకోకుండా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ‘పార్టీ ఫిరాయింపుల చట్టం’ అనేది ఒక సగం మార్గం అయితే, ‘రైట్ టు రీకాల్’ అనేది పూర్తి మార్గం. ఇది మన భవిష్యత్తు పోరాటం.

మన నిస్సహాయత ఒక బలంగా మారాలి! మనం ఓటు వేసిన నాయకులు మనల్ని దగా చేసినప్పుడు, మనలో కలిగే ఆ బాధ, ఆ ఆగ్రహం వృథా పోకూడదు. ఆ బాధనే ఒక బలంగా మార్చుకొని, ఈ వ్యవస్థను మార్చడానికి మనం సిద్ధం కావాలి.

ఇకపై ఓటు వేయడం మాత్రమే కాదు, మన నాయకులను ఎన్నుకున్న మనమే వారిని నిలదీద్దాం. మన ఆదర్శాలను, మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకుందాం. యుద్ధాల కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మీడియా వేదికగా, మన స్వరం వినిపిస్తాడనుకున్న నాయకుడికి మన గళం వినిపిద్దాం. 'రైట్ టు రీకాల్' కోసం పోరాడుదాం. రైట్ టు రీకాల్ అనేది ఒక కల కాదు, అది మన హక్కు. దాని కోసం మనం పోరాడదాం. ఈ పోరాటం మన కోసం కాదు, రేపటి తరాల కోసం.

JaiHind!

Search
Categories
Read More
Maharashtra
महाराष्ट्रातील काही शाळांना पावसामुळे आणि सणांमुळे सुट्टी
१२ सप्टेंबर २०२५ रोजी महाराष्ट्रातील काही भागांतील शाळांना पावसामुळे आणि स्थानिक...
By Pooja Patil 2025-09-12 06:30:14 0 260
Andhra Pradesh
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ డ్రామాలు: దేవినేని అవినాష్ విమర్శలు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వదిలి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ...
By Rajini Kumari 2026-02-10 10:25:57 0 137
Andhra Pradesh
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Gadiyapudi Narendra 2025-12-28 16:21:23 0 229
Karnataka
Union Finance Minister Nirmala Sitharaman Launches ‘VijAIpatha’: A National CSR Initiative to Democratize AI and Robotics in Government Schools
  HAMPI, KARNATAKA — December 20, 2025 — Union Minister for Finance and...
By Venugopal Gopal 2025-12-22 16:13:40 0 406
Telangana
తెలంగాణలో త్వరలో ఎస్ఐఆర్.|
    హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ(SIR)ను...
By Sidhu Maroju 2025-12-21 11:26:20 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com