సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
691

 

 సికింద్రాబాద్/ కంటోన్మెంట్.  

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా గ్రౌండ్స్ లో నేడు మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి సారధ్యంలో నిర్వహిస్తున్న (Maa off season Telangana State Championship-) 2025 క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 30 సంవత్సరాలు పైబడిన పురుషులు మరియు మహిళలకు నిర్వహించే ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడలకు వయసుతో సంబంధం లేదని ఆరోగ్యవంతమైన జీవితానికి క్రీడలు ఆడటం చాలా మంచిదని దీనివల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరిక ఆరోగ్యం మరియు క్రీడా స్ఫూర్తి పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం పలు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన మెడల్స్ ప్రధానం చేశారు.ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

 

-సిద్దుమారోజు

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు ప్రగతి నగర్ లో కార్డెన్ సెర్చ్.... 28 వాహనాలు సీజ్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో శనివారం ఉదయం పోలీసులు గార్డెన్ సెర్చ్ చేశారు...
By John Baji 2025-12-27 12:10:17 0 86
Telangana
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾
🌾 సంక్రాంతి వెలుగులు - భారత్ ఆవాజ్ పిలుపు! 🌾       చీకటిని చీల్చుకుంటూ వచ్చే...
By Vanmoj Suryamohan 2026-01-13 15:03:09 0 156
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం వెళ్లేవారికి అన్నదానం కార్యక్రమం చేస్తున్న టిడిపి రవీంద్ర వర్గం
డాక్టర్ మన్నే రవీంద్ర మాజీ టెక్నాలజీ చైర్మన్ వడ్లమూరి లింగన్న మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ...
By Chennaiah Kati 2026-02-14 14:58:24 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com